ఐఏసీఈ చరిత్ర సృష్టించింది గ్రాండ్ సక్సెస్ మీట్లో చైర్మన్ వినయ్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్ రావు
ఐఏసీఈ చరిత్ర సృష్టించింది గ్రాండ్ సక్సెస్ మీట్లో చైర్మన్ వినయ్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్ రావు
RAPOLU LINGASWAMY
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో ఐఏసీఈ సంస్థ చరిత్ర సృష్టించిందని ఆ సంస్థ చైర్మన్ వినయ్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. శనివారం సరూర్నగర్లో నిర్వహించిన ఐఏసీఈ గ్రాండ్ సక్సెస్ మీట్–2026 కార్యక్రమంలో వారు మాట్లాడుతూ
రాష్ట్రాల్లో ఒకప్పుడు ఎస్ఎస్సీ సీజీఎల్పై అవగాహన చాలా తక్కువగా ఉండేదని, అలాంటి పరిస్థితుల్లో గత 12 సంవత్సరాలుగా తెలుగు విద్యార్థులను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల వైపు నడిపిస్తూ ఐఏసీఈ అద్భుత ఫలితాలు సాధిస్తోందన్నారు. ముఖ్యంగా 2025 సంవత్సరంలో ఆల్ ఇండియా 54 ,59,72,120,287,324,349...మరెన్నో ర్యాంకులతో విద్యార్థులు ప్రతిభ చాటడంతో సంస్థ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిందని పేర్కొన్నారు.
క్లాస్రూమ్ కోచింగ్ ద్వారానే అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలు సాధింపజేసిన సంస్థగా ఐఏసీఈ నిలిచిందన్నారు. ఐదు ఎకరాల విస్తీర్ణంలో రెసిడెన్షియల్ క్యాంపస్ ఏర్పాటు చేసి నాణ్యమైన శిక్షణ అందించడం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు. విద్యార్థుల కృషి, అధ్యాపకుల నిబద్ధత, తల్లిదండ్రుల సహకారంతోనే ఈ స్థాయికి చేరుకున్నామని పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి