ఐఐఎం కలకత్తాకు తెలంగాణ శోభ బోర్డు ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్గా మామిడాల జగదీష్ కుమార్
ఐఐఎం కలకత్తాకు తెలంగాణ శోభ బోర్డు ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్గా మామిడాల జగదీష్ కుమార్
Komidala Mahender reddy
తెలంగాణకు మరో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. దేశంలోని అగ్రశ్రేణి మేనేజ్మెంట్విద్యాసంస్థల్లో ఒకటైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మానేజ్మెంట్ కాల్షియట్ట బోర్డు ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్గా ప్రముఖ విద్యావేత్త మామిడాల జగదీష్ కుమార్ని యమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగేళ్లపాటు ఆయన ఈకీలకబాధ్యతలనునిర్వర్తించనున్నారు.నల్గొండ జిల్లా మామిడాల గ్రామానికి చెందిన జగదీష్ కుమార్ విద్యా రంగంలో విశేష అనుభవం కలిగిన వ్యక్తి. ఇటీవల వరకు ఆయన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ర్ చైర్మన్ గా సేవలందించారు. అంతకు ముందు దేశంలోని ప్రముఖ కేంద్ర విశ్వవిద్యాలయం అయిన జవహర్లల్ నెహ్రు యూనివర్సిటీ కు వైస్ చాన్సలర్గా కూడా బాధ్యతలు నిర్వహించారు.
విద్యా పరిపాలనలో విశాల అనుభవం, సంస్కరణల దిశగా తీసుకున్న నిర్ణయాలతో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇప్పుడు ఐఐఎం కలకత్తా బోర్డు ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్గా నియామకం కావడం తెలంగాణకు గర్వకారణంగా నిలిచింది. దేశ విద్యా రంగంలో తెలంగాణ ప్రతిభ మరొకసారి వెలుగొందిందని విద్యావేత్తలుఅభిప్రాయపడుతున్నారు.తెలంగాణకు చెందిన వ్యక్తి దేశంలోని ప్రముఖ విద్యాసంస్థకు నేతృత్వం వహించనున్న నేపథ్యంలో విద్యార్థులు, మేధావులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి