ఆహార భద్రతకు కోత వద్దు. వికలాంగుల సలహా మండలిని వెంటనే ఏర్పాటు చేయాలి.
ఆహార భద్రతకు కోత వద్దు. వికలాంగుల సలహా మండలిని వెంటనే ఏర్పాటు చేయాలి.
Editor Desk
భువనగిరి,
జాతీయ ఆహార భద్రత చట్టానికి సవరణలు చేయాలనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని, 2016 ఆర్పీడీ చట్టం ప్రకారం రాష్ట్ర వికలాంగుల సలహా మండలిని ఏర్పాటు చేయాలని ఎన్పీఆర్డీ డిమాండ్ చేసింది.
సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నా అనంతరం ఏవో ఎన్. అంజి రెడ్డికు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షుడు సురూపంగ ప్రకాష్, ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ.. అంత్యోదయ రేషన్లో కోతలు వికలాంగులు, పేద కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని అన్నారు. అలాగే 2019 తర్వాత రాష్ట్ర వికలాంగుల సలహా మండలిని పునర్నియమించకపోవడం వల్ల చట్ట అమలు దెబ్బతింటోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్పీఆర్డీ జిల్లా కోశాధికారి కొత్త లలిత, జిల్లా కమిటీ సభ్యులు గడ్డం యాదగిరి, కొలీలిపాక నాగయ్య, వస్తుప్పల మంజుల, ఏశాల గోపి, వల్లాల రాధాకృష్ణ, నూకల వెంకటేష్ స్వామి, వడ్డే సుజాత తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి