Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామలింగేశ్వర ఆలయంలో నవగ్రహ మండప శంకుస్థాపన కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 12:47 AM

ఆగిరిపల్లి లో హెల్మెట్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై శుభశేఖర్

ఆగిరిపల్లి లో హెల్మెట్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై శుభశేఖర్

ఆగిరిపల్లి లో హెల్మెట్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై శుభశేఖర్
March 06, 2026 08:14 PM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఆగిరిపల్లి : రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ఆగిరిపల్లి మండలంలో ఎస్సై శుభశేఖర్ ఆధ్వర్యంలో హెల్మెట్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్సై సూచించారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం తగ్గుతుందని తెలిపారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

కార్యక్రమంలో భాగంగా పోలీసులు వాహనదారులను ఆపి హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. కొంతమంది వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేసి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.

ప్రజలు తమ భద్రత కోసం ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్ ధరించడం అలవాటు చేసుకోవాలని ఎస్సై శుభశేఖర్ కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News