Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బుక్ రివ్యూ కార్యక్రమం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 08:17 AM

ఆగిరిపల్లి లో హెల్మెట్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై శుభశేఖర్

ఆగిరిపల్లి లో హెల్మెట్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై శుభశేఖర్

ఆగిరిపల్లి లో హెల్మెట్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై శుభశేఖర్
March 06, 2026 08:14 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఆగిరిపల్లి : రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ఆగిరిపల్లి మండలంలో ఎస్సై శుభశేఖర్ ఆధ్వర్యంలో హెల్మెట్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్సై సూచించారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం తగ్గుతుందని తెలిపారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

కార్యక్రమంలో భాగంగా పోలీసులు వాహనదారులను ఆపి హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. కొంతమంది వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేసి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.

ప్రజలు తమ భద్రత కోసం ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్ ధరించడం అలవాటు చేసుకోవాలని ఎస్సై శుభశేఖర్ కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News