Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:03 AM

అగ్నిప్రమాదాలపై అప్రమత్తత అవసరం ​

అగ్నిప్రమాదాలపై అప్రమత్తత అవసరం ​

అగ్నిప్రమాదాలపై అప్రమత్తత అవసరం ​
16-04-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వేసవి కాలంలో పెరిగే ఉష్ణోగ్రతల దృష్ట్యా అగ్నిప్రమాదాల పట్ల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖ అధికారులు సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా (ఏప్రిల్ 14 నుండి 20 వరకు) గురువారం శాంతినగర్ కాలనీలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

ప్రమాదాలకు కారణాలు - నివారణ మార్గాలు:

ఈ సందర్భంగా అగ్నిమాపక కేంద్ర అధికారి బి. శివాజీ మాట్లాడుతూ.. వేసవిలో చిన్నపాటి అజాగ్రత్త కూడా పెను ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.​బీడీలు, సిగరెట్లు కాల్చి ఆర్పకుండా పడేయడం వల్ల ఎండుగడ్డి వాములు, చెత్త కుప్పలు తగలబడి ఇళ్లకు వ్యాపించే ప్రమాదం ఉంది.

​గృహాల్లో గ్యాస్ సిలిండర్ల వినియోగంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.​విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌ల పట్ల నిరంతరం నిఘా ఉంచాలి.​అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన ప్రాథమిక జాగ్రత్తలను, మంటలను ఆర్పే విధానాలను సిబ్బంది స్థానికులకు వివరించారు.ఈ కార్యక్రమంలో లీడింగ్ ఫైర్ ఫైటర్లు ఆర్. అనిల్ కుమార్, జి. నాగేశ్వరావు, సిబ్బంది డి. దిలీప్, టి. ప్రసాద్ తదితరులు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.

Sthanikam

అగ్నిప్రమాదాలపై అప్రమత్తత అవసరం ​

Article Image

వేసవి కాలంలో పెరిగే ఉష్ణోగ్రతల దృష్ట్యా అగ్నిప్రమాదాల పట్ల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖ అధికారులు సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా (ఏప్రిల్ 14 నుండి 20 వరకు) గురువారం శాంతినగర్ కాలనీలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

ప్రమాదాలకు కారణాలు - నివారణ మార్గాలు:

ఈ సందర్భంగా అగ్నిమాపక కేంద్ర అధికారి బి. శివాజీ మాట్లాడుతూ.. వేసవిలో చిన్నపాటి అజాగ్రత్త కూడా పెను ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.​బీడీలు, సిగరెట్లు కాల్చి ఆర్పకుండా పడేయడం వల్ల ఎండుగడ్డి వాములు, చెత్త కుప్పలు తగలబడి ఇళ్లకు వ్యాపించే ప్రమాదం ఉంది.

​గృహాల్లో గ్యాస్ సిలిండర్ల వినియోగంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.​విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌ల పట్ల నిరంతరం నిఘా ఉంచాలి.​అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన ప్రాథమిక జాగ్రత్తలను, మంటలను ఆర్పే విధానాలను సిబ్బంది స్థానికులకు వివరించారు.ఈ కార్యక్రమంలో లీడింగ్ ఫైర్ ఫైటర్లు ఆర్. అనిల్ కుమార్, జి. నాగేశ్వరావు, సిబ్బంది డి. దిలీప్, టి. ప్రసాద్ తదితరులు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News