అగ్నిప్రమాదాలపై అప్రమత్తత అవసరం
అగ్నిప్రమాదాలపై అప్రమత్తత అవసరం
K.RAVI
వేసవి కాలంలో పెరిగే ఉష్ణోగ్రతల దృష్ట్యా అగ్నిప్రమాదాల పట్ల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖ అధికారులు సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా (ఏప్రిల్ 14 నుండి 20 వరకు) గురువారం శాంతినగర్ కాలనీలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ప్రమాదాలకు కారణాలు - నివారణ మార్గాలు:
ఈ సందర్భంగా అగ్నిమాపక కేంద్ర అధికారి బి. శివాజీ మాట్లాడుతూ.. వేసవిలో చిన్నపాటి అజాగ్రత్త కూడా పెను ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.బీడీలు, సిగరెట్లు కాల్చి ఆర్పకుండా పడేయడం వల్ల ఎండుగడ్డి వాములు, చెత్త కుప్పలు తగలబడి ఇళ్లకు వ్యాపించే ప్రమాదం ఉంది.
గృహాల్లో గ్యాస్ సిలిండర్ల వినియోగంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.విద్యుత్ షార్ట్ సర్క్యూట్ల పట్ల నిరంతరం నిఘా ఉంచాలి.అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన ప్రాథమిక జాగ్రత్తలను, మంటలను ఆర్పే విధానాలను సిబ్బంది స్థానికులకు వివరించారు.ఈ కార్యక్రమంలో లీడింగ్ ఫైర్ ఫైటర్లు ఆర్. అనిల్ కుమార్, జి. నాగేశ్వరావు, సిబ్బంది డి. దిలీప్, టి. ప్రసాద్ తదితరులు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి