Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:23 PM

అగ్నిమాపక వారోత్సవాలు: విద్యార్థులకు అవగాహన

అగ్నిమాపక వారోత్సవాలు: విద్యార్థులకు అవగాహన

అగ్నిమాపక వారోత్సవాలు: విద్యార్థులకు అవగాహన
20-04-2026 71 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా పట్టణంలోని డాన్ బోస్కో పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా స్టేషన్ ఫైర్ ఆఫీసర్ బి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆకస్మికంగా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, వాటిని ఎలా నియంత్రించాలి అనే విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా వేసవికాలంలో అగ్నిప్రమాదాలు అధికంగా జరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అనంతరం నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో లీడింగ్ ఫైర్ ఫైటర్ డి. రామ్ నర్సయ్య, అగ్నిమాపక సిబ్బంది మీర్జా షఫీ భేగ్, మహేశ్వరం పాండు, దావునూరి గోపాల్, చలమల్ల మధు, పాఠశాల కరస్పాండెంట్ జానీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ఓవర్

Sthanikam

అగ్నిమాపక వారోత్సవాలు: విద్యార్థులకు అవగాహన

Article Image

రామన్నపేట: అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా పట్టణంలోని డాన్ బోస్కో పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా స్టేషన్ ఫైర్ ఆఫీసర్ బి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆకస్మికంగా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, వాటిని ఎలా నియంత్రించాలి అనే విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా వేసవికాలంలో అగ్నిప్రమాదాలు అధికంగా జరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అనంతరం నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో లీడింగ్ ఫైర్ ఫైటర్ డి. రామ్ నర్సయ్య, అగ్నిమాపక సిబ్బంది మీర్జా షఫీ భేగ్, మహేశ్వరం పాండు, దావునూరి గోపాల్, చలమల్ల మధు, పాఠశాల కరస్పాండెంట్ జానీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ఓవర్

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News