అగ్నిమాపక వారోత్సవాలు: విద్యార్థులకు అవగాహన
అగ్నిమాపక వారోత్సవాలు: విద్యార్థులకు అవగాహన
Editor Desk
రామన్నపేట: అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా పట్టణంలోని డాన్ బోస్కో పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా స్టేషన్ ఫైర్ ఆఫీసర్ బి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆకస్మికంగా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, వాటిని ఎలా నియంత్రించాలి అనే విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా వేసవికాలంలో అగ్నిప్రమాదాలు అధికంగా జరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అనంతరం నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో లీడింగ్ ఫైర్ ఫైటర్ డి. రామ్ నర్సయ్య, అగ్నిమాపక సిబ్బంది మీర్జా షఫీ భేగ్, మహేశ్వరం పాండు, దావునూరి గోపాల్, చలమల్ల మధు, పాఠశాల కరస్పాండెంట్ జానీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ఓవర్

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి