Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 04:53 AM

అగ్నిమాపక వారోత్సవాలు: విద్యార్థులకు అవగాహన

అగ్నిమాపక వారోత్సవాలు: విద్యార్థులకు అవగాహన

అగ్నిమాపక వారోత్సవాలు: విద్యార్థులకు అవగాహన
April 20, 2026 06:10 PM 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా పట్టణంలోని డాన్ బోస్కో పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా స్టేషన్ ఫైర్ ఆఫీసర్ బి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆకస్మికంగా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, వాటిని ఎలా నియంత్రించాలి అనే విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా వేసవికాలంలో అగ్నిప్రమాదాలు అధికంగా జరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అనంతరం నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో లీడింగ్ ఫైర్ ఫైటర్ డి. రామ్ నర్సయ్య, అగ్నిమాపక సిబ్బంది మీర్జా షఫీ భేగ్, మహేశ్వరం పాండు, దావునూరి గోపాల్, చలమల్ల మధు, పాఠశాల కరస్పాండెంట్ జానీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ఓవర్

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News