PRINT TIME: March 08, 2026 01:42 AM
అంగన్వాడి పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ ఉమామహేశ్వరి
అంగన్వాడి పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ ఉమామహేశ్వరి
March 07, 2026 11:35 PM
8 Views
స్థానికం ప్రతినిధి :
CHOUTUPPAL MANDAL
K.RAVI
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 17, 18వ వార్డుల అంగన్వాడి కేంద్రాల్లో శనివారం ‘ఆరోగ్య లక్ష్మి’ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి హాజరై మాట్లాడుతూ. గర్భిణీలు, బాలింతలు అంగన్వాడి కేంద్రాలను తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆమె సూచించారు. మూడు సంవత్సరాలు నిండిన చిన్నారులను అంగన్వాడి కేంద్రాలకు పంపించాలని, ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ టి. శోభారాణి, సీనియర్ సిటిజన్ భీముడి మోహన్ రెడ్డి, అంగన్వాడి టీచర్లు కాసోజు సుజాత, సుక్క జ్యోతి, ఆర్పి కల్పన, ఆశ కార్యకర్తలు చెన్నోజు స్వాతి, పాస్తాం అనిత, అంగన్వాడి ఆయాలు సైదమ్మ, అంజమ్మ, అంగన్వాడి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి