ఎల్జె బీ నగర్ హస్తినాపురం పి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన కార్తీక్ హాస్పిటల్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి ఆసుపత్రి నిర్వాహకుడు డాక్టర్ కార్తీక్తో కలిసి ఘనంగా ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని వైద్య సదుపాయాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరారు.. ఆధునిక సదుపాయాలతో ప్రజలకు మెరుగైన చికిత్స అందిస్తూ కార్తీక్ హాస్పిటల్ ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.
ఆసుపత్రి నిర్వాహకులు మాట్లాడుతూ తక్కువ ఫీజులతో ఉత్తమ వైద్యం అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నందిని, ఆసుపత్రి సిబ్బంది, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి