PRINT TIME: March 29, 2026 09:58 PM
ఆదోనిలో ఘనంగా టిడిపి ఆవిర్భావ వేడుకలు
ఆదోనిలో ఘనంగా టిడిపి ఆవిర్భావ వేడుకలు
March 29, 2026 07:47 PM
7 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఆదోని: తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదోని నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. టిడిపి ఇన్చార్జ్, మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు, యువ నాయకుడు భూపాల్ చౌదరి కలిసి పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందించిన నాయకులను సన్మానించారు.
వారి సేవలను కొనియాడుతూ పార్టీ పట్ల ఉన్న అంకితభావాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ, వార్డు నాయకులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి