Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 10:08 PM

ఆదోనిలో ఘనంగా టిడిపి ఆవిర్భావ వేడుకలు

ఆదోనిలో ఘనంగా టిడిపి ఆవిర్భావ వేడుకలు

ఆదోనిలో ఘనంగా టిడిపి ఆవిర్భావ వేడుకలు
29-03-2026 94 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని: తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదోని నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. టిడిపి ఇన్చార్జ్, మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు, యువ నాయకుడు భూపాల్ చౌదరి కలిసి పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందించిన నాయకులను సన్మానించారు.

వారి సేవలను కొనియాడుతూ పార్టీ పట్ల ఉన్న అంకితభావాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ, వార్డు నాయకులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Sthanikam

ఆదోనిలో ఘనంగా టిడిపి ఆవిర్భావ వేడుకలు

Article Image

ఆదోని: తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదోని నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. టిడిపి ఇన్చార్జ్, మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు, యువ నాయకుడు భూపాల్ చౌదరి కలిసి పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందించిన నాయకులను సన్మానించారు.

వారి సేవలను కొనియాడుతూ పార్టీ పట్ల ఉన్న అంకితభావాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ, వార్డు నాయకులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News