Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
'ఐరా' గ్లోబల్ స్కూల్ విద్యార్థుల ఘనత లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:09 PM

అదాని సిమెంట్ పనులు నిలిపివేయాలని కలెక్టర్‌కు వినతి

అదాని సిమెంట్ పనులు నిలిపివేయాలని కలెక్టర్‌కు వినతి

అదాని సిమెంట్ పనులు నిలిపివేయాలని కలెక్టర్‌కు వినతి
April 02, 2026 06:10 PM 100 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారిందని, వెంటనే నూతన భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సీపీఎం నేతలు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిని కోరారు. గురువారం కలెక్టర్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా సీపీఎం ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య మాట్లాడుతూ— సుమారు 50 ఏళ్ల క్రితం నిర్మించిన ఆసుపత్రి భవనం ప్రస్తుతం పెచ్చులూడుతూ ఎప్పుడైనా కూలే ప్రమాదంలో ఉందన్నారు. వెంటనే రూ.40 కోట్లు మంజూరు చేసి 100 పడకల సదుపాయంతో నూతన ఆసుపత్రి నిర్మించాలని డిమాండ్ చేశారు. అలాగే కనీస మౌలిక సదుపాయాలు కల్పించి పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు. పలుమార్లు సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని విమర్శించారు.

ఇక రామన్నపేట పరిధిలో అంబుజా అదాని సిమెంట్ పరిశ్రమ ప్రతిపాదిత ప్రాజెక్టుపై ప్రజలు ఇప్పటికే వ్యతిరేకత వ్యక్తం చేశారని తెలిపారు. అయినప్పటికీ ఎలాంటి అనుమతులు లేకుండా భారీ యంత్రాలతో పనులు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఆ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బల్గురి అంజయ్య, కందుల హనుమంతు, గన్నేబోయిన విజయభాస్కర్, గొరిగే సోములు, డీవైఎఫ్ఐ మండల అధ్యక్షుడు శానగొండ రాము, జల్లెల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News