Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పట్టణాభివృద్ధికి వేగం… మౌలిక సదుపాయాలే తొలి ప్రాధాన్యం- చైర్మన్ పావని రమేష్ గౌడ్ బిడ్డను ఒడిలో, మందుల పెట్టె చేతిలో… నది దాటి టీకాలు ఇస్తున్న మంతి కుమారి “మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఆర్టీసీకి అద్దె బస్సులు… మహిళల ఆర్థిక సాధికారతకు కొత్త దిశ : సి‌ఎం రేవంత్” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 02, 2026 08:05 PM

అదాని సిమెంట్ పనులు నిలిపివేయాలని కలెక్టర్‌కు వినతి

అదాని సిమెంట్ పనులు నిలిపివేయాలని కలెక్టర్‌కు వినతి

అదాని సిమెంట్ పనులు నిలిపివేయాలని కలెక్టర్‌కు వినతి
April 02, 2026 06:10 PM 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారిందని, వెంటనే నూతన భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సీపీఎం నేతలు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిని కోరారు. గురువారం కలెక్టర్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా సీపీఎం ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య మాట్లాడుతూ— సుమారు 50 ఏళ్ల క్రితం నిర్మించిన ఆసుపత్రి భవనం ప్రస్తుతం పెచ్చులూడుతూ ఎప్పుడైనా కూలే ప్రమాదంలో ఉందన్నారు. వెంటనే రూ.40 కోట్లు మంజూరు చేసి 100 పడకల సదుపాయంతో నూతన ఆసుపత్రి నిర్మించాలని డిమాండ్ చేశారు. అలాగే కనీస మౌలిక సదుపాయాలు కల్పించి పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు. పలుమార్లు సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని విమర్శించారు.

ఇక రామన్నపేట పరిధిలో అంబుజా అదాని సిమెంట్ పరిశ్రమ ప్రతిపాదిత ప్రాజెక్టుపై ప్రజలు ఇప్పటికే వ్యతిరేకత వ్యక్తం చేశారని తెలిపారు. అయినప్పటికీ ఎలాంటి అనుమతులు లేకుండా భారీ యంత్రాలతో పనులు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఆ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బల్గురి అంజయ్య, కందుల హనుమంతు, గన్నేబోయిన విజయభాస్కర్, గొరిగే సోములు, డీవైఎఫ్ఐ మండల అధ్యక్షుడు శానగొండ రాము, జల్లెల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News