అంబేద్కర్ సారు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆర్డరు ఇవ్వండి - పూస శ్రీనివాస్
అంబేద్కర్ సారు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆర్డరు ఇవ్వండి - పూస శ్రీనివాస్
Sthanikam District Staff Reporter
భువనగిరి టౌన్:తెలంగాణ రాష్ట్రం రావడం కోసం తగించి కోట్లాడిన ఉద్యమకారులకు న్యాయం చేయాలని అంబేద్కర్ సారు రేవంత్రెడ్డి ప్రభుత్వానికి ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలని డా॥ బి.ఆర్. అంబేద్కర్ సారు ఆర్డరు (ఆదేశం) ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూస శ్రీనివాస్ విగ్రహం వద్ద కోరినారు.శనివారం రోజు వినాయక చౌరస్తా భువనగిరి జిల్లా కేంద్రంలోని డా॥ బి.ఆర్.అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రము ఇవ్వడం జరిగినది.రాష్ట్రంలోని సబ్బండ వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తున్నదని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం ఉద్యమకారుల పట్ల ఎందుకు వివక్ష చూపిస్తోందో అర్ధం అవ్వటం లేదని ఆర్టికల్ 3 ప్రకారము చిన్న రాష్ట్రాలు కావాలన్న అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్న మాకు అంబేద్కర్ గారే పెద్ద దిక్కు అయ్యారని పూస శ్రీనివాస్ తెలిపినారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలము, రూ॥ 30,000 పెన్షన్ హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరినారు. ఈ కార్యక్రమంలో టి.ఎల్.ఎఫ్.కొడిమాల క్రిష్ణ,గొర్ల లక్ష్మణ్,మంతపురం వినోద్ కుమార్,గోపరాజు గణేష్, నర్సింహ్మ,తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి