అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు రామన్నపేట లో సన్నాహాలు
అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు రామన్నపేట లో సన్నాహాలు
Editor Desk
రామన్నపేట మండల కేంద్రంలో డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన సన్నాహక సమావేశానికి అడ్వకేట్, సహాయ ప్రభుత్వ న్యాయవాది సుక్క శ్రవణ్ కుమార్ అధ్యక్షత వహించారు.
ఈ సమావేశంలో వివిధ గ్రామాల పెద్దలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, యువకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు పలు సూచనలు, అభిప్రాయాలను వెల్లడించారు.
ఏప్రిల్ 1వ తేదీ ఉదయం 11 గంటలకు మండల కేంద్రంలో నూతన అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. కొత్త కమిటీ ఆధ్వర్యంలో ఈసారి జయంతి ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో పూర్వ కమిటీ సభ్యులు, ప్రస్తుత సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం, పూర్వ కమిటీ చైర్మన్ నాగేటి ఉపేందర్, నోముల చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి