Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శిథిలావస్థకు చేరిన బాలికల హాస్టల్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:39 PM

అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు రామన్నపేట లో సన్నాహాలు

అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు రామన్నపేట లో సన్నాహాలు

అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు రామన్నపేట లో సన్నాహాలు
31-03-2026 247 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండల కేంద్రంలో డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన సన్నాహక సమావేశానికి అడ్వకేట్, సహాయ ప్రభుత్వ న్యాయవాది సుక్క శ్రవణ్ కుమార్ అధ్యక్షత వహించారు.

ఈ సమావేశంలో వివిధ గ్రామాల పెద్దలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, యువకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు పలు సూచనలు, అభిప్రాయాలను వెల్లడించారు.

ఏప్రిల్ 1వ తేదీ ఉదయం 11 గంటలకు మండల కేంద్రంలో నూతన అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. కొత్త కమిటీ ఆధ్వర్యంలో ఈసారి జయంతి ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ కార్యక్రమంలో పూర్వ కమిటీ సభ్యులు, ప్రస్తుత సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం, పూర్వ కమిటీ చైర్మన్ నాగేటి ఉపేందర్, నోముల చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు రామన్నపేట లో సన్నాహాలు

Article Image

రామన్నపేట మండల కేంద్రంలో డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన సన్నాహక సమావేశానికి అడ్వకేట్, సహాయ ప్రభుత్వ న్యాయవాది సుక్క శ్రవణ్ కుమార్ అధ్యక్షత వహించారు.

ఈ సమావేశంలో వివిధ గ్రామాల పెద్దలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, యువకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు పలు సూచనలు, అభిప్రాయాలను వెల్లడించారు.

ఏప్రిల్ 1వ తేదీ ఉదయం 11 గంటలకు మండల కేంద్రంలో నూతన అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. కొత్త కమిటీ ఆధ్వర్యంలో ఈసారి జయంతి ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ కార్యక్రమంలో పూర్వ కమిటీ సభ్యులు, ప్రస్తుత సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం, పూర్వ కమిటీ చైర్మన్ నాగేటి ఉపేందర్, నోముల చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News