అంబేద్కర్ 135వ జయంతికి రామన్నపేటలో భారీ ఏర్పాట్లు
అంబేద్కర్ 135వ జయంతికి రామన్నపేటలో భారీ ఏర్పాట్లు
Editor Desk
రామన్నపేట మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అంబేద్కర్ వాదులు కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు స్థానిక రహదారి బంగ్లాలో సోమవారం సమావేశం నిర్వహించి జయంతి ఉత్సవ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కమిటీ కన్వీనర్గా బొడ్డు సురేందర్రావు, కో-కన్వీనర్గా నాగటి ఉపేందర్, సోషల్ మీడియా కన్వీనర్గా ఎర్ర నరేష్ను ఎంపిక చేశారు. అదేవిధంగా మరో 13 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ… మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి అంబేద్కర్ అభిమానులను సమీకరించి, మండల కేంద్రంలో భారీ ర్యాలీతో జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
నూతన కమిటీ సభ్యులుగా నల్ల స్వామి, నోముల చిరంజీవి, కంచి మధుసూదన్, కోళ్ల రామకృష్ణ, కక్కిరేణి విజయ్కుమార్, భాష మల్ల సంతోష్, గాదె నరేందర్, నకిరేకంటి నరేందర్, బొడ్డు శంకర్, జనపాల లక్ష్మణ్, నకరికంటే మొగులయ్య, బలుగూరి అంజయ్య, ఏలూరి రవిలు ఎన్నికయ్యారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి