99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక ప్రారంభం వార్డుల సమస్యలకు తక్షణ పరిష్కారం చైర్మన్ గీత రమేష్
99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక ప్రారంభం వార్డుల సమస్యలకు తక్షణ పరిష్కారం చైర్మన్ గీత రమేష్
Komidala Mahender reddy
మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్ తెలిపారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో ఈ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 12 వార్డుల్లో ఉన్న పారిశుద్ధ్య సమస్యలు, తాగునీటి సరఫరా లోపాలు, వీధిదీపాల నిర్వహణతో పాటు కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వివిధ ప్రజా సమస్యలను గుర్తించితక్షణమేపరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ప్రత్యక్షంగా స్వీకరించి వాటిని వేగంగా పరిష్కరించే దిశగా అధికారులు, సిబ్బందితో కలిసి కార్యాచరణ కొనసాగిస్తామని పేర్కొన్నారు.కార్యక్రమంలో భాగంగా 12వ వార్డులోని ప్రభుత్వ పాఠశాల వెనుక కాలనీలో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. కాలనీలో చెత్త తొలగింపు, కాలువల శుభ్రత వంటి పనులను మున్సిపల్ సిబ్బంది చేపట్టారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మీ సైదులు, కమిషనర్ దండు శ్రీను, కౌన్సిలర్లు కుక్కల మోహన్, ఏర్పుల పరమేష్, దేశపాక లతా రాజేష్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి పోకల దేవదాస్, పట్టణ అధ్యక్షుడు జడల చిన్న మల్లయ్య, ఎద్దులపూరి కృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి