PRINT TIME: April 20, 2026 09:56 PM
76 మంది గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు: మంత్రి సవిత
76 మంది గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు: మంత్రి సవిత
April 20, 2026 07:32 PM
21 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో సీఎం N. చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో 76 మంది గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు ఘనంగా జరిపించారు.
ఈ సందర్భంగా గర్భిణీలకు ఆశీర్వాదాలు అందజేసి, వస్త్రాలు పంపిణీ చేశారు. తల్లి మరియు శిశు ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని మంత్రి తెలిపారు. మహిళల సంక్షేమం, గర్భిణీల ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తు కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
ప్రతి తల్లి ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని మంత్రి సవిత అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి