Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రామాలకూ చేరిన “స్థానికం” – ఆసక్తిగా చదువుతున్న ప్రజలు రెడ్స్ సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహ కార్యక్రమం ఉధంపూర్‌లో ఘోర ప్రమాదం: 100 అడుగుల లోయలో పడ్డ బస్సు.. 15 మంది మృతి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 20, 2026 09:56 PM

76 మంది గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు: మంత్రి సవిత

76 మంది గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు: మంత్రి సవిత

76 మంది గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు: మంత్రి సవిత
April 20, 2026 07:32 PM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో సీఎం N. చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో 76 మంది గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు ఘనంగా జరిపించారు.

ఈ సందర్భంగా గర్భిణీలకు ఆశీర్వాదాలు అందజేసి, వస్త్రాలు పంపిణీ చేశారు. తల్లి మరియు శిశు ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని మంత్రి తెలిపారు. మహిళల సంక్షేమం, గర్భిణీల ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తు కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రతి తల్లి ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని మంత్రి సవిత అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News