Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆర్టీసీ సమ్మె వేళ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 23, 2026 05:22 PM

2బీహెచ్‌కే ఇండ్ల పనులు త్వరగా పూర్తి చేయాలి. కలెక్టర్

2బీహెచ్‌కే ఇండ్ల పనులు త్వరగా పూర్తి చేయాలి. కలెక్టర్

2బీహెచ్‌కే ఇండ్ల పనులు త్వరగా పూర్తి చేయాలి. కలెక్టర్
March 10, 2026 06:38 PM 19 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పెండింగ్‌లో ఉన్న 2బీహెచ్‌కే (డబుల్ బెడ్‌రూమ్) ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.

మంగళవారం భువనగిరి మండలంలోని సింగన్నగూడెం గ్రామంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఇండ్ల నిర్మాణ పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఇంకా ఏ పనులు పెండింగ్‌లో ఉన్నాయో, ప్రస్తుతం జరుగుతున్న పనులు ఏ దశలో ఉన్నాయో, మిగిలిన పనులు ఎప్పటికి పూర్తి చేస్తారో వివరాలు తెలుసుకున్నారు. ఆలస్యం అవుతున్న పనులను వేగవంతం చేసి ప్రతి ఇంటికి సంబంధించిన పనులను త్వరగా పూర్తి చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏడి శ్రీరాములు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News