200 మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు
200 మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు
Editor Desk
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
హెల్త్ క్యాంప్తో విద్యార్థులకు సేవలు
అడ్డగూడూరు: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా యాదాద్రి జిల్లా వైద్యాధికారి డా. మనోహర్ ఆధ్వర్యంలో సోమవారం అడ్డగూడూరు కేజీబీవీ పాఠశాలలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. జిల్లా రోగనిరోధక అధికారి డా. రామకృష్ణ, ఆర్బీఎస్కే డాక్టర్ జి. శ్రీకాంత్ సమన్వయంతో జరిగిన ఈ శిబిరంలో సుమారు 200 మంది విద్యార్థులకు స్పెషలిస్ట్ వైద్యులు పరీక్షలు నిర్వహించారు.
పీడియాట్రీషియన్ డా. వీరన్న, డెంటల్ డాక్టర్ గాంధీ, ఆఫ్తల్మాలజిస్ట్ డా. స్వప్న, గైనకాలజిస్ట్ డా. సుప్రియలు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులకు సీపీఆర్ ట్రైనింగ్, స్ట్రెస్ మేనేజ్మెంట్పై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో ఫార్మసీ ఆఫీసర్ కళ్యాణి, కళాశాల ప్రిన్సిపాల్ పద్మ, పీహెచ్సీ అడ్డగూడూరు సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి