13న కామేపల్లి మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన భారీ ర్యాలీకి కాంగ్రెస్ శ్రేణులు తరలిరావాలి: మేకల మల్లిబాబు యాదవ్
13న కామేపల్లి మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన భారీ ర్యాలీకి కాంగ్రెస్ శ్రేణులు తరలిరావాలి: మేకల మల్లిబాబు యాదవ్
స్థానికం బృందం
ఈనెల 13న కామేపల్లి మండలంలో జరగనున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తో పాటు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరుకానున్నారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా పండితాపురం పశువుల సంత నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంట భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు కామేపల్లి మాజీ జెడ్పిటిసి, డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్తె లిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పొంగులేటి అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు ఎక్కువ సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు మల్లిబాబు యాదవ్ పేర్కొన్నారు. ఇప్పటికే దాదాపు 70 శాతం ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, ఎక్కడా అవినీతి లేకుండా పారదర్శకంగా బిల్లులు మంజూరు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి దక్కుతుందని అన్నారు. అలాగే ఇల్లందు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే కోరం కనకయ్యకు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొమనేపల్లి గ్రామ ఉప సర్పంచ్ మేకల మల్లికార్జునరావు, వార్డు సభ్యులు ధరావతలాలు నాయక్, ఎస్.కె. రబ్బానీ పాషా, మండల కాంగ్రెస్ నాయకులు గుగులోతు రవి, డేరంగుల తిరపయ్య, మొగిలి శ్రీను, మేకల లక్ష్మీనారాయణ, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి