100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలంటూ నిరాహార దీక్షకు పిలుపు
100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలంటూ నిరాహార దీక్షకు పిలుపు
స్థానికం బృందం
రామన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో విద్య, వైద్యం, ఉపాధి రంగాలకు నిధులు కేటాయిస్తున్నామని ప్రతి సారి ప్రకటించినప్పటికీ, ఆ నిధులు గ్రామీణ ఆసుపత్రులకు పూర్తిగా చేరడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రామన్నపేట ఆసుపత్రిపై పరిసర మండలాల ప్రజలు ఎక్కువగా ఆధారపడుతున్నారని తెలిపారు. ప్రతి వారం సుమారు 15 మందికి పైగా రోగులు ఓపీ సేవలు పొందుతున్నప్పటికీ, తీవ్ర అనారోగ్య పరిస్థితులు తలెత్తినప్పుడు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని చెప్పారు.
ప్రభుత్వం తక్షణం స్పందించి రామన్నపేట తాలూకా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసి అవసరమైన నిధులు మంజూరు చేస్తే వందలాది మంది ప్రాణాలను కాపాడవచ్చని ప్రజలు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ప్రజల ఆరోగ్య హక్కుల సాధన కోసం మార్చి 16న రామన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఎదుట నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామంలోని చైతన్యవంతులు, విద్యావంతులు, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి