Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వ్యసనాలతో జీవితాలను పాడుచేసుకోవద్దని ప్రచారం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 26, 2026 05:17 AM

100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలంటూ నిరాహార దీక్షకు పిలుపు

100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలంటూ నిరాహార దీక్షకు పిలుపు

100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలంటూ నిరాహార దీక్షకు పిలుపు
March 15, 2026 05:00 PM 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో విద్య, వైద్యం, ఉపాధి రంగాలకు నిధులు కేటాయిస్తున్నామని ప్రతి సారి ప్రకటించినప్పటికీ, ఆ నిధులు గ్రామీణ ఆసుపత్రులకు పూర్తిగా చేరడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రామన్నపేట ఆసుపత్రిపై పరిసర మండలాల ప్రజలు ఎక్కువగా ఆధారపడుతున్నారని తెలిపారు. ప్రతి వారం సుమారు 15 మందికి పైగా రోగులు ఓపీ సేవలు పొందుతున్నప్పటికీ, తీవ్ర అనారోగ్య పరిస్థితులు తలెత్తినప్పుడు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని చెప్పారు.

ప్రభుత్వం తక్షణం స్పందించి రామన్నపేట తాలూకా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసి అవసరమైన నిధులు మంజూరు చేస్తే వందలాది మంది ప్రాణాలను కాపాడవచ్చని ప్రజలు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ప్రజల ఆరోగ్య హక్కుల సాధన కోసం మార్చి 16న రామన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఎదుట నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామంలోని చైతన్యవంతులు, విద్యావంతులు, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News