యువతపై మహనీయుల ఆశయాల బాధ్యత – కళ్లెం కృష్ణ
యువతపై మహనీయుల ఆశయాల బాధ్యత – కళ్లెం కృష్ణ
Editor Desk
యాదగిరిగుట్ట: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని యాదగిరిగుట్ట పట్టణంలో బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సమితి జిల్లా అధ్యక్షుడు కళ్లెం కృష్ణ మాట్లాడుతూ మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందన్నారు. సమాజంలో కుల వివక్ష, అంటరానితనం నిర్మూలనకు, వెనుకబడిన వర్గాల హక్కుల సాధనకు పూలే చేసిన కృషి అపారమని కొనియాడారు. మహిళలకు విద్యావకాశాలు కల్పించేందుకు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లూరి రాజయ్య, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరబోయిన మహేందర్, సిపిఐ మండల కార్యదర్శి కలిపెల్లి మహేందర్, మున్సిపల్ కౌన్సిలర్ బబ్బురి శ్రీధర్, బీసీ హక్కుల సాధన సమితి మండల అధ్యక్షుడు పాకాలపాటి రాజు, ప్రధాన కార్యదర్శి అనంతుల నరసింహ, మాజీ కోఆప్షన్ సభ్యుడు పేరబోయిన పెంటయ్య, రైతు సంఘం నాయకులు, కార్మిక సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి