Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం 10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:44 PM

యువతపై మహనీయుల ఆశయాల బాధ్యత – కళ్లెం కృష్ణ

యువతపై మహనీయుల ఆశయాల బాధ్యత – కళ్లెం కృష్ణ

యువతపై మహనీయుల ఆశయాల బాధ్యత – కళ్లెం కృష్ణ
April 11, 2026 05:35 PM 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని యాదగిరిగుట్ట పట్టణంలో బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సమితి జిల్లా అధ్యక్షుడు కళ్లెం కృష్ణ మాట్లాడుతూ మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందన్నారు. సమాజంలో కుల వివక్ష, అంటరానితనం నిర్మూలనకు, వెనుకబడిన వర్గాల హక్కుల సాధనకు పూలే చేసిన కృషి అపారమని కొనియాడారు. మహిళలకు విద్యావకాశాలు కల్పించేందుకు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లూరి రాజయ్య, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరబోయిన మహేందర్, సిపిఐ మండల కార్యదర్శి కలిపెల్లి మహేందర్, మున్సిపల్ కౌన్సిలర్ బబ్బురి శ్రీధర్, బీసీ హక్కుల సాధన సమితి మండల అధ్యక్షుడు పాకాలపాటి రాజు, ప్రధాన కార్యదర్శి అనంతుల నరసింహ, మాజీ కోఆప్షన్ సభ్యుడు పేరబోయిన పెంటయ్య, రైతు సంఘం నాయకులు, కార్మిక సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News