యూరియా బుకింగ్ యాప్తో ఎరువుల సరఫరా
యూరియా బుకింగ్ యాప్తో ఎరువుల సరఫరా
Editor Desk
భువనగిరి,
రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఎరువుల సరఫరాను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు “యూరియా బుకింగ్ యాప్” ద్వారా పంపిణీ కొనసాగుతున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ తెలిపింది. గత యాసంగి సీజన్లో ప్రారంభించిన ఈ విధానం రాబోయే ఖరీఫ్-2026 సీజన్లో కూడా అమలు చేయనున్నారు.
ఈ నేపథ్యంలో రైతులు తమ మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. మొబైల్ నంబర్ మార్పు అవసరమున్న రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి (AEO)ను సంప్రదించి వివరాలు నవీకరించుకోవచ్చు.
జిల్లాలో పనిచేస్తున్న ADAలు, MAOలు, AEOలు విస్తృత ప్రచారం చేపట్టి, ఏప్రిల్ 20లోపు రైతుల మొబైల్ నంబర్లు అప్డేట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
యూరియా బుకింగ్ యాప్ ద్వారా ఎరువులు పొందాలంటే ప్రస్తుత మొబైల్ నంబర్ నమోదు తప్పనిసరి అని తెలిపారు. అందువల్ల రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని, నిర్ణీత గడువులోపు తమ మొబైల్ నంబర్లను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి పి.వి. రమణా రెడ్డి సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి