Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం 10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:42 PM

యూరియా బుకింగ్ యాప్‌తో ఎరువుల సరఫరా

యూరియా బుకింగ్ యాప్‌తో ఎరువుల సరఫరా

యూరియా బుకింగ్ యాప్‌తో ఎరువుల సరఫరా
April 10, 2026 07:28 PM 132 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,

రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఎరువుల సరఫరాను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు “యూరియా బుకింగ్ యాప్” ద్వారా పంపిణీ కొనసాగుతున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ తెలిపింది. గత యాసంగి సీజన్‌లో ప్రారంభించిన ఈ విధానం రాబోయే ఖరీఫ్-2026 సీజన్‌లో కూడా అమలు చేయనున్నారు.

ఈ నేపథ్యంలో రైతులు తమ మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. మొబైల్ నంబర్ మార్పు అవసరమున్న రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి (AEO)ను సంప్రదించి వివరాలు నవీకరించుకోవచ్చు.

జిల్లాలో పనిచేస్తున్న ADAలు, MAOలు, AEOలు విస్తృత ప్రచారం చేపట్టి, ఏప్రిల్ 20లోపు రైతుల మొబైల్ నంబర్లు అప్డేట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

యూరియా బుకింగ్ యాప్ ద్వారా ఎరువులు పొందాలంటే ప్రస్తుత మొబైల్ నంబర్ నమోదు తప్పనిసరి అని తెలిపారు. అందువల్ల రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని, నిర్ణీత గడువులోపు తమ మొబైల్ నంబర్లను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి పి.వి. రమణా రెడ్డి సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News