PRINT TIME: April 01, 2026 07:50 PM
యాట విష్ణు తల్లి మరణం… సీపీఎం నేతల సంతాపం
యాట విష్ణు తల్లి మరణం… సీపీఎం నేతల సంతాపం
April 01, 2026 05:15 PM
81 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట సీపీఎం పట్టణ కమిటీ సభ్యులు యాట విష్ణు మాతృమూర్తి అనారోగ్యంతో మరణించడంతో పార్టీ నాయకులు ఆమె పార్ధివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జెల్లల పెంటయ్య, మండల కార్యదర్శివర్గ సభ్యులు కందుల హనుమంతు, పట్టణ కార్యదర్శి మునికుంట్ల లెనిన్ తదితరులు కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో గొరిగె సోములు, బావాండ్లపల్లి బాలరాజు, సత్యం, తరిగొప్పుల వెంకటరెడ్డి, నకిరేకంటి రాము, కుందూరు వెంకటేశ్వర్లు, బోల్లా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి