యాదగిరిగుట్టలో ‘అరైవ్ అలైవ్’ – రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు
యాదగిరిగుట్టలో ‘అరైవ్ అలైవ్’ – రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు
Editor Desk
యాదగిరిగుట్ట: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా, డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “అరైవ్ అలైవ్” క్యాంపెయిన్-2026 కార్యక్రమం యాదగిరిగుట్టలో నిర్వహించారు.
ఈ సందర్భంగా మండలంలోని ప్రభుత్వ శాఖల అధికారులు, మున్సిపాలిటీ చైర్మన్, కౌన్సిలర్లు, గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఈనెల 13 నుంచి 18 వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
సీసీ కెమెరాల ప్రాముఖ్యత, రోడ్డు భద్రత నియమాలు కచ్చితంగా పాటించాలని సూచించారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని, సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్టులపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.
యువతను గంజాయి, డ్రగ్స్ నుంచి దూరంగా ఉంచాలని, డ్రంక్ అండ్ డ్రైవ్, రాష్ డ్రైవింగ్ను నివారించాలని సూచించారు. ఎటువంటి సమస్య వచ్చినా 100 నంబర్కు కాల్ చేసి పోలీసులను సంప్రదించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్, వైస్ చైర్మన్ బరిగే రమ్య రామచందర్, టౌన్ సీఐ భాస్కర్, ట్రాఫిక్ సీఐ కృష్ణ, ఎస్సై యాదయ్య, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి