Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 10:59 PM

యాదగిరిగుట్టలో ‘అరైవ్ అలైవ్’ – రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు

యాదగిరిగుట్టలో ‘అరైవ్ అలైవ్’ – రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు

యాదగిరిగుట్టలో ‘అరైవ్ అలైవ్’ – రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు
April 11, 2026 05:05 PM 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా, డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “అరైవ్ అలైవ్” క్యాంపెయిన్-2026 కార్యక్రమం యాదగిరిగుట్టలో నిర్వహించారు.

ఈ సందర్భంగా మండలంలోని ప్రభుత్వ శాఖల అధికారులు, మున్సిపాలిటీ చైర్మన్, కౌన్సిలర్లు, గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఈనెల 13 నుంచి 18 వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

సీసీ కెమెరాల ప్రాముఖ్యత, రోడ్డు భద్రత నియమాలు కచ్చితంగా పాటించాలని సూచించారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని, సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్టులపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.

యువతను గంజాయి, డ్రగ్స్ నుంచి దూరంగా ఉంచాలని, డ్రంక్ అండ్ డ్రైవ్, రాష్ డ్రైవింగ్‌ను నివారించాలని సూచించారు. ఎటువంటి సమస్య వచ్చినా 100 నంబర్‌కు కాల్ చేసి పోలీసులను సంప్రదించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్, వైస్ చైర్మన్ బరిగే రమ్య రామచందర్, టౌన్ సీఐ భాస్కర్, ట్రాఫిక్ సీఐ కృష్ణ, ఎస్సై యాదయ్య, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News