Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నదాతల ఆక్రందనలు పట్టని పాలకులు – అశోక్ రెడ్డి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 07:10 PM

యాదగిరిగుట్టలో ‘అరైవ్ అలైవ్’ – రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు

యాదగిరిగుట్టలో ‘అరైవ్ అలైవ్’ – రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు

యాదగిరిగుట్టలో ‘అరైవ్ అలైవ్’ – రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు
April 11, 2026 05:05 PM 15 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా, డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “అరైవ్ అలైవ్” క్యాంపెయిన్-2026 కార్యక్రమం యాదగిరిగుట్టలో నిర్వహించారు.

ఈ సందర్భంగా మండలంలోని ప్రభుత్వ శాఖల అధికారులు, మున్సిపాలిటీ చైర్మన్, కౌన్సిలర్లు, గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఈనెల 13 నుంచి 18 వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

సీసీ కెమెరాల ప్రాముఖ్యత, రోడ్డు భద్రత నియమాలు కచ్చితంగా పాటించాలని సూచించారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని, సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్టులపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.

యువతను గంజాయి, డ్రగ్స్ నుంచి దూరంగా ఉంచాలని, డ్రంక్ అండ్ డ్రైవ్, రాష్ డ్రైవింగ్‌ను నివారించాలని సూచించారు. ఎటువంటి సమస్య వచ్చినా 100 నంబర్‌కు కాల్ చేసి పోలీసులను సంప్రదించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్, వైస్ చైర్మన్ బరిగే రమ్య రామచందర్, టౌన్ సీఐ భాస్కర్, ట్రాఫిక్ సీఐ కృష్ణ, ఎస్సై యాదయ్య, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News