PRINT TIME: April 08, 2026 11:32 PM
యాదగిరిగుట్ట దేవస్థానంలో ఎస్పీఎఫ్ సిబ్బంది స్వచ్ఛ భారత్
యాదగిరిగుట్ట దేవస్థానంలో ఎస్పీఎఫ్ సిబ్బంది స్వచ్ఛ భారత్
April 08, 2026 10:03 PM
11 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదగిరిగుట్ట: టీజీ ఎస్పీఎఫ్ (TG SPF) డీజీ స్వాతి లాక్రా ఆదేశాల మేరకు, యాదగిరిగుట్ట ఆలయ భద్రతా విభాగం సిబ్బంది బుధవారం కొండ పైనుండి వైకుంఠ ద్వారం మెట్ల దారి వరకు 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎఫ్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఇన్స్పెక్టర్ కె. శేషగిరి రావు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా సేకరించిన చెత్తను ట్రాక్టర్ ద్వారా సురక్షితంగా తరలించారు. ఈ స్వచ్ఛ భారత్ సేవలో ఎస్ఐ రవి, ఏఎస్ఐలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి