Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:25 PM

యాదాద్రిలో భక్తుల రద్దీ… నిత్య రాబడి రూ.12.82 లక్షలు

యాదాద్రిలో భక్తుల రద్దీ… నిత్య రాబడి రూ.12.82 లక్షలు

యాదాద్రిలో భక్తుల రద్దీ… నిత్య రాబడి రూ.12.82 లక్షలు
16-04-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట,

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రమైన యాదాద్రిలో గురువారం భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ అర్చకులు స్వామివారికి నిత్య పూజలు, ఆరాధనలు నిర్వహించారు.

కుటుంబ సభ్యులతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన సువర్ణ పుష్పార్చన, నిత్య కళ్యాణం, వేద ఆశీర్వచనం, సాయంత్రం వెండి మొక్కు జోడి సేవల్లో పాల్గొన్నారు. కొండకింద సత్యనారాయణ స్వామి వ్రతాల్లోనూ భక్తులు పాల్గొన్నారు.

అనుబంధ ఆలయమైన శ్రీ పర్వత వర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి, పాత గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను కూడా దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

స్వామివారి నిత్య రాబడిగా గురువారం రూ.12,82,284 వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఉప ప్రధాన అర్చకులు మంగళగిరి నరసింహమూర్తి, ప్రశాంత్ చార్యులు, రామాచార్యులు, ఇన్‌చార్జి వెంకటేష్, ఎస్పీఎఫ్ సిబ్బంది, దేవస్థాన సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Sthanikam

యాదాద్రిలో భక్తుల రద్దీ… నిత్య రాబడి రూ.12.82 లక్షలు

Article Image

యాదగిరిగుట్ట,

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రమైన యాదాద్రిలో గురువారం భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ అర్చకులు స్వామివారికి నిత్య పూజలు, ఆరాధనలు నిర్వహించారు.

కుటుంబ సభ్యులతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన సువర్ణ పుష్పార్చన, నిత్య కళ్యాణం, వేద ఆశీర్వచనం, సాయంత్రం వెండి మొక్కు జోడి సేవల్లో పాల్గొన్నారు. కొండకింద సత్యనారాయణ స్వామి వ్రతాల్లోనూ భక్తులు పాల్గొన్నారు.

అనుబంధ ఆలయమైన శ్రీ పర్వత వర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి, పాత గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను కూడా దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

స్వామివారి నిత్య రాబడిగా గురువారం రూ.12,82,284 వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఉప ప్రధాన అర్చకులు మంగళగిరి నరసింహమూర్తి, ప్రశాంత్ చార్యులు, రామాచార్యులు, ఇన్‌చార్జి వెంకటేష్, ఎస్పీఎఫ్ సిబ్బంది, దేవస్థాన సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News