యాదాద్రిలో భక్తుల రద్దీ… నిత్య రాబడి రూ.12.82 లక్షలు
యాదాద్రిలో భక్తుల రద్దీ… నిత్య రాబడి రూ.12.82 లక్షలు
Editor Desk
యాదగిరిగుట్ట,
శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రమైన యాదాద్రిలో గురువారం భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ అర్చకులు స్వామివారికి నిత్య పూజలు, ఆరాధనలు నిర్వహించారు.
కుటుంబ సభ్యులతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన సువర్ణ పుష్పార్చన, నిత్య కళ్యాణం, వేద ఆశీర్వచనం, సాయంత్రం వెండి మొక్కు జోడి సేవల్లో పాల్గొన్నారు. కొండకింద సత్యనారాయణ స్వామి వ్రతాల్లోనూ భక్తులు పాల్గొన్నారు.
అనుబంధ ఆలయమైన శ్రీ పర్వత వర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి, పాత గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను కూడా దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వామివారి నిత్య రాబడిగా గురువారం రూ.12,82,284 వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఉప ప్రధాన అర్చకులు మంగళగిరి నరసింహమూర్తి, ప్రశాంత్ చార్యులు, రామాచార్యులు, ఇన్చార్జి వెంకటేష్, ఎస్పీఎఫ్ సిబ్బంది, దేవస్థాన సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి