వంశపారంపర్య క్యాన్సర్ల పెరుగుదలపై నిపుణుల హెచ్చరిక
వంశపారంపర్య క్యాన్సర్ల పెరుగుదలపై నిపుణుల హెచ్చరిక
Editor Desk
నల్గొండ,
నేటి జీవనశైలి మార్పులు, పర్యావరణ ప్రభావాలు, జన్యు ఉత్పరివర్తనాల కారణంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని నిపుణులు తెలిపారు. ముఖ్యంగా ధూమపానం చేయని వారు, యువతలో కూడా ఈ వ్యాధి పెరుగుతుండటం ఆందోళనకరమన్నారు.
సోమాజిగూడ యశోద హాస్పిటల్స్కు చెందిన కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డా. హరీష్ కాంచర్ల మాట్లాడుతూ, వంశపారంపర్య క్యాన్సర్లను ముందుగానే గుర్తించేందుకు NGS, PCR వంటి ఆధునాతన పరీక్షలు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. లిక్విడ్ బయాప్సీ వంటి సాధారణ రక్త పరీక్షల ద్వారా ప్రమాదం ఉన్న కుటుంబ సభ్యులకు కూడా ముందస్తు స్క్రీనింగ్ చేయవచ్చని చెప్పారు.
టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ వంటి ఆధునిక చికిత్సలతో రోగుల మనుగడ రేటు, జీవన నాణ్యత మెరుగవుతున్నాయని వివరించారు. లక్షణాలు కనిపించకముందే స్క్రీనింగ్ చేయించుకుంటే చికిత్స ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని సూచించారు.
క్యాన్సర్ కుటుంబ చరిత్ర ఉన్నవారు తప్పనిసరిగా జన్యు సలహా తీసుకుని, సకాలంలో పరీక్షలు చేయించుకోవాలని యశోద హాస్పిటల్స్ నిపుణులు సూచించారు.
మూడు దశాబ్దాలుగా వైద్య సేవలు అందిస్తున్న యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ, సికింద్రాబాద్, మలక్పేట్, హైటెక్ సిటీలలో నాలుగు ఆసుపత్రులతో 4000 పడకల సామర్థ్యంతో అత్యాధునిక సాంకేతికతతో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్ మేనేజర్ పరమేష్, డా. హరీష్ కాంచర్ల, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి