ఆదోని,: ఆదోని–ఆలూరు రోడ్డుపై నూతన బైపాస్ సమీపంలోని మేక వంకను కుదించి చట్టవిరుద్ధంగా నిర్మించిన సిమెంట్ కాలువను వెంటనే తొలగించాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ డిమాండ్ చేశారు. సమాచారం మేరకు ఆయన ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.
వంకలను కుదిస్తూ ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్)ను ధ్వంసం చేయడం వల్ల బ్యాక్వాటర్ ప్రభావంతో ఆదోని పట్టణం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్రమణలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు.
మేక వంకను తక్షణమే సర్వే చేసి ఆక్రమణలను తొలగించి, ఎఫ్టీఎల్ మేరకు పునరుద్ధరించాలని కోరారు. లేదంటే ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి