Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు అందాలి – కలెక్టర్ బి. చంద్రశేఖర్ బోల్తా పడిన ఆర్టీసీ బస్సు. 30 మంది ప్రయాణికులు సురక్షితం 131వ సవరణ: ప్రజాస్వామ్య బలోపేతమా? లేక కొత్త సవాళ్ల ఆరంభమా? ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 21, 2026 09:59 PM

వంక ఆక్రమణలు తొలగించాలి. నూర్ అహ్మద్

వంక ఆక్రమణలు తొలగించాలి. నూర్ అహ్మద్

వంక ఆక్రమణలు తొలగించాలి. నూర్ అహ్మద్
April 21, 2026 08:16 PM 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని,: ఆదోని–ఆలూరు రోడ్డుపై నూతన బైపాస్ సమీపంలోని మేక వంకను కుదించి చట్టవిరుద్ధంగా నిర్మించిన సిమెంట్ కాలువను వెంటనే తొలగించాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ డిమాండ్ చేశారు. సమాచారం మేరకు ఆయన ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.

వంకలను కుదిస్తూ ఎఫ్‌టీఎల్‌ (ఫుల్ ట్యాంక్ లెవల్‌)ను ధ్వంసం చేయడం వల్ల బ్యాక్‌వాటర్ ప్రభావంతో ఆదోని పట్టణం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్రమణలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు.

మేక వంకను తక్షణమే సర్వే చేసి ఆక్రమణలను తొలగించి, ఎఫ్‌టీఎల్‌ మేరకు పునరుద్ధరించాలని కోరారు. లేదంటే ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News