వివాహేతర సంబంధం.. భర్త హత్యకు కుట్ర
వివాహేతర సంబంధం.. భర్త హత్యకు కుట్ర
Editor Desk
ప్రియుడితో కలిసి రూ.10 లక్షల సుపారీ.. తప్పించుకున్న భర్త
ప్రొద్దుటూరు: భార్య వివాహేతర సంబంధం భర్త ప్రాణాలపైకి తెచ్చిన ఘటన వైఎస్సార్ కడప జిల్లాలో వెలుగుచూసింది. లింగాపురానికి చెందిన ఈశ్వర్రెడ్డి, శిల్పారెడ్డి దంపతులు 15 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ఇటీవల వీరి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి.
ఈ క్రమంలో జమ్మలమడుగుకు చెందిన నాగసుధీర్తో శిల్పారెడ్డికి పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధంగా మారింది. విషయం తెలుసుకున్న ఈశ్వర్రెడ్డి భార్యను మందలించగా, ఆమె ప్రియుడితో కలిసి అతన్ని హత్య చేయాలని కుట్ర పన్నింది.
కిరాయి ముఠాకు రూ.10 లక్షల సుపారీ ఇచ్చి భర్తను చంపేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే ఈ కుట్ర విషయం ముందుగానే తెలుసుకున్న ఈశ్వర్రెడ్డి అప్రమత్తమై తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి