Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సతి గృహ అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి: సబ్ కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 01:53 PM

వివాహేతర సంబంధం.. భర్త హత్యకు కుట్ర

వివాహేతర సంబంధం.. భర్త హత్యకు కుట్ర

వివాహేతర సంబంధం.. భర్త హత్యకు కుట్ర
April 24, 2026 09:29 AM 62 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రియుడితో కలిసి రూ.10 లక్షల సుపారీ.. తప్పించుకున్న భర్త

ప్రొద్దుటూరు: భార్య వివాహేతర సంబంధం భర్త ప్రాణాలపైకి తెచ్చిన ఘటన వైఎస్సార్ కడప జిల్లాలో వెలుగుచూసింది. లింగాపురానికి చెందిన ఈశ్వర్‌రెడ్డి, శిల్పారెడ్డి దంపతులు 15 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ఇటీవల వీరి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి.

ఈ క్రమంలో జమ్మలమడుగుకు చెందిన నాగసుధీర్‌తో శిల్పారెడ్డికి పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధంగా మారింది. విషయం తెలుసుకున్న ఈశ్వర్‌రెడ్డి భార్యను మందలించగా, ఆమె ప్రియుడితో కలిసి అతన్ని హత్య చేయాలని కుట్ర పన్నింది.

కిరాయి ముఠాకు రూ.10 లక్షల సుపారీ ఇచ్చి భర్తను చంపేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే ఈ కుట్ర విషయం ముందుగానే తెలుసుకున్న ఈశ్వర్‌రెడ్డి అప్రమత్తమై తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News