నకిరేకల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్గా నియమితులైన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, జనహృదయ నేతగా పేరుపొందిన వీరేశంకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. జిల్లా నాయకుడు పూస బాలకిషన్ ఆధ్వర్యంలో ఇంద్రపాలనగరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు శాలువాలు కప్పి పూలమాలలతో సత్కరించారు.
కార్యక్రమంలో పలువురు నాయకులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి