Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్వతాపురం రోడ్డుకు భూమిపూజ.. రూ.30 లక్షలతో బీటీ రోడ్డు ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు నరాలు తెగే ఉత్కంఠ... ఢిల్లీ చేతిలో గెలుపు.. గుజరాత్ తన్నుకుపోయింది! “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 09, 2026 07:13 PM

వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలి. వనం ఉపేందర్

వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలి. వనం ఉపేందర్

వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలి. వనం ఉపేందర్
April 09, 2026 05:27 PM 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మోత్కూర్: వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎన్‌పీఆర్‌డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ డిమాండ్ చేశారు. గురువారం మోత్కూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్‌పీఆర్‌డీ టౌన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

వికలాంగులకు ప్రత్యేక సంక్షేమ శాఖ ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదని, ప్రస్తుతం శిశు సంక్షేమ శాఖలోనే కొనసాగించడం వల్ల బడ్జెట్ కేటాయింపులు స్పష్టంగా తెలియని పరిస్థితి నెలకొన్నదన్నారు. వెంటనే ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలని కోరారు.

వికలాంగులకు పెండింగ్‌లో ఉన్న పెన్షన్ బకాయిలను విడుదల చేసి, నెలకు రూ.6,000 పెన్షన్‌ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పరికరాల పంపిణీ, ఉపాధి అవకాశాల కోసం రుణాలు ఇప్పటికీ అందడం లేదని, ప్రతి వికలాంగుడికి బ్యాంకుల ద్వారా రూ.10 లక్షల వరకు రుణాలు అందించాలని కోరారు.

అలాగే ఉచిత బస్సు సౌకర్యం, రేషన్ కార్డు ద్వారా 35 కిలోల బియ్యం అందించడంతో పాటు, గ్రామపంచాయతీ నుంచి అసెంబ్లీ, పార్లమెంట్ వరకు నామినేటెడ్ పోస్టుల్లో వికలాంగులకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎన్‌పీఆర్‌డీ నాయకులు గడ్డం యాదగిరి, ఎర్రవెల్లి నాగేష్, గౌలికర్ రాజు, గుండు శ్రీనివాస్, అప్పల యాదగిరి, వెంకటేష్, మంజుల, గొడిశాల యాదగిరి, చేతరాశి రమేష్, జయభిక్షం, ఎండి జమాల్, ఎస్.కె కాశీం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News