వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలి. వనం ఉపేందర్
వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలి. వనం ఉపేందర్
Editor Desk
మోత్కూర్: వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎన్పీఆర్డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ డిమాండ్ చేశారు. గురువారం మోత్కూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్పీఆర్డీ టౌన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
వికలాంగులకు ప్రత్యేక సంక్షేమ శాఖ ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదని, ప్రస్తుతం శిశు సంక్షేమ శాఖలోనే కొనసాగించడం వల్ల బడ్జెట్ కేటాయింపులు స్పష్టంగా తెలియని పరిస్థితి నెలకొన్నదన్నారు. వెంటనే ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలని కోరారు.
వికలాంగులకు పెండింగ్లో ఉన్న పెన్షన్ బకాయిలను విడుదల చేసి, నెలకు రూ.6,000 పెన్షన్ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పరికరాల పంపిణీ, ఉపాధి అవకాశాల కోసం రుణాలు ఇప్పటికీ అందడం లేదని, ప్రతి వికలాంగుడికి బ్యాంకుల ద్వారా రూ.10 లక్షల వరకు రుణాలు అందించాలని కోరారు.
అలాగే ఉచిత బస్సు సౌకర్యం, రేషన్ కార్డు ద్వారా 35 కిలోల బియ్యం అందించడంతో పాటు, గ్రామపంచాయతీ నుంచి అసెంబ్లీ, పార్లమెంట్ వరకు నామినేటెడ్ పోస్టుల్లో వికలాంగులకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్పీఆర్డీ నాయకులు గడ్డం యాదగిరి, ఎర్రవెల్లి నాగేష్, గౌలికర్ రాజు, గుండు శ్రీనివాస్, అప్పల యాదగిరి, వెంకటేష్, మంజుల, గొడిశాల యాదగిరి, చేతరాశి రమేష్, జయభిక్షం, ఎండి జమాల్, ఎస్.కె కాశీం తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి