Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 02:13 PM

వికలాంగుల సమస్యలపై పోరాటం ఉధృతం. యాదగిరిగుట్ట రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి : ఎన్‌పీఆర్‌డీ

వికలాంగుల సమస్యలపై పోరాటం ఉధృతం. యాదగిరిగుట్ట రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి : ఎన్‌పీఆర్‌డీ

వికలాంగుల సమస్యలపై పోరాటం ఉధృతం. యాదగిరిగుట్ట రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి : ఎన్‌పీఆర్‌డీ
May 18, 2026 04:26 PM 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట : వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా పోరాట కార్యాచరణ రూపొందించేందుకు ఈనెల 29, 30, 31 తేదీలలో యాదగిరిగుట్టలో నిర్వహించే రాష్ట్ర శిక్షణ తరగతులు, రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని ఎన్‌పీఆర్‌డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ పిలుపునిచ్చారు.

రామన్నపేట మండలం రామన్నపేట టౌన్, తుమ్మలగూడెం గ్రామంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం కరపత్రాన్ని విడుదల చేశారు.

వికలాంగులకు సదరం సర్టిఫికెట్లు వచ్చినా పెన్షన్లు మంజూరు కాకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం బడ్జెట్ లేదనే కారణంతో కొత్త పెన్షన్ల మంజూరులో జాప్యం చేస్తోందని విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

మండలంలో అనేక మంది వికలాంగులు సదరం సర్టిఫికెట్లు, యూడీఐడీ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారని, వాటిని తక్షణమే అందించాలని కోరారు. వికలాంగులకు ఇంద్రమ్మ ఇళ్లు కేటాయించడంతో పాటు స్థలం లేని వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఉపాధి హామీ పథకంలో వికలాంగులకు ప్రత్యేక పనులు కల్పించి, 150 రోజుల ఉపాధితో రోజుకు రూ.600 కూలి చెల్లించాలని కోరారు. కొత్త జాబ్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో గిరికల లింగస్వామి, నాగు నరసింహ, పాలశం పరుశురాం, సువి కిష్టయ్య, లావణ్య, చిన్నోజు శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News