Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:00 AM

వికలాంగుల సమస్యలపై పోరాటం ఉధృతం. యాదగిరిగుట్ట రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి : ఎన్‌పీఆర్‌డీ

వికలాంగుల సమస్యలపై పోరాటం ఉధృతం. యాదగిరిగుట్ట రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి : ఎన్‌పీఆర్‌డీ

వికలాంగుల సమస్యలపై పోరాటం ఉధృతం. యాదగిరిగుట్ట రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి : ఎన్‌పీఆర్‌డీ
18-05-2026 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట : వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా పోరాట కార్యాచరణ రూపొందించేందుకు ఈనెల 29, 30, 31 తేదీలలో యాదగిరిగుట్టలో నిర్వహించే రాష్ట్ర శిక్షణ తరగతులు, రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని ఎన్‌పీఆర్‌డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ పిలుపునిచ్చారు.

రామన్నపేట మండలం రామన్నపేట టౌన్, తుమ్మలగూడెం గ్రామంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం కరపత్రాన్ని విడుదల చేశారు.

వికలాంగులకు సదరం సర్టిఫికెట్లు వచ్చినా పెన్షన్లు మంజూరు కాకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం బడ్జెట్ లేదనే కారణంతో కొత్త పెన్షన్ల మంజూరులో జాప్యం చేస్తోందని విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

మండలంలో అనేక మంది వికలాంగులు సదరం సర్టిఫికెట్లు, యూడీఐడీ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారని, వాటిని తక్షణమే అందించాలని కోరారు. వికలాంగులకు ఇంద్రమ్మ ఇళ్లు కేటాయించడంతో పాటు స్థలం లేని వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఉపాధి హామీ పథకంలో వికలాంగులకు ప్రత్యేక పనులు కల్పించి, 150 రోజుల ఉపాధితో రోజుకు రూ.600 కూలి చెల్లించాలని కోరారు. కొత్త జాబ్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో గిరికల లింగస్వామి, నాగు నరసింహ, పాలశం పరుశురాం, సువి కిష్టయ్య, లావణ్య, చిన్నోజు శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వికలాంగుల సమస్యలపై పోరాటం ఉధృతం. యాదగిరిగుట్ట రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి : ఎన్‌పీఆర్‌డీ

Article Image

రామన్నపేట : వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా పోరాట కార్యాచరణ రూపొందించేందుకు ఈనెల 29, 30, 31 తేదీలలో యాదగిరిగుట్టలో నిర్వహించే రాష్ట్ర శిక్షణ తరగతులు, రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని ఎన్‌పీఆర్‌డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ పిలుపునిచ్చారు.

రామన్నపేట మండలం రామన్నపేట టౌన్, తుమ్మలగూడెం గ్రామంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం కరపత్రాన్ని విడుదల చేశారు.

వికలాంగులకు సదరం సర్టిఫికెట్లు వచ్చినా పెన్షన్లు మంజూరు కాకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం బడ్జెట్ లేదనే కారణంతో కొత్త పెన్షన్ల మంజూరులో జాప్యం చేస్తోందని విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

మండలంలో అనేక మంది వికలాంగులు సదరం సర్టిఫికెట్లు, యూడీఐడీ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారని, వాటిని తక్షణమే అందించాలని కోరారు. వికలాంగులకు ఇంద్రమ్మ ఇళ్లు కేటాయించడంతో పాటు స్థలం లేని వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఉపాధి హామీ పథకంలో వికలాంగులకు ప్రత్యేక పనులు కల్పించి, 150 రోజుల ఉపాధితో రోజుకు రూ.600 కూలి చెల్లించాలని కోరారు. కొత్త జాబ్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో గిరికల లింగస్వామి, నాగు నరసింహ, పాలశం పరుశురాం, సువి కిష్టయ్య, లావణ్య, చిన్నోజు శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News