Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:08 PM

వికలాంగుల పెన్షన్ రూ.6,000కు పెంచాలి: ఎన్‌పీఆర్‌డీ

వికలాంగుల పెన్షన్ రూ.6,000కు పెంచాలి: ఎన్‌పీఆర్‌డీ

వికలాంగుల పెన్షన్ రూ.6,000కు పెంచాలి: ఎన్‌పీఆర్‌డీ
24-04-2026 137 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి వికలాంగుల పెన్షన్‌ను రూ.6,000కు పెంచి వెంటనే అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య డిమాండ్ చేశారు. వికలాంగుల చట్టాలు, సంక్షేమ పథకాల అమలుకు ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

జిల్లా అధ్యక్షుడు సూరపంగా ప్రకాష్ అధ్యక్షతన దుంపల మల్లారెడ్డి స్మారక భవనంలో జరిగిన జిల్లా విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా వికలాంగులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించారు. పెన్షన్లు పెంచడంలో ఆలస్యం ఎందుకని ప్రశ్నించారు. 2026-27 బడ్జెట్‌లో వికలాంగుల సంక్షేమానికి తగిన నిధులు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెన్షన్లు రద్దు చేసినట్లు ఆరోపిస్తూ, ప్రభుత్వ కార్యాలయాల్లో వికలాంగులకు అనుకూల సౌకర్యాలు లేవని పేర్కొన్నారు. విద్య, ఉపాధి అవకాశాల్లో వివక్ష కొనసాగుతోందని, వికలాంగులపై వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.

మే 29 నుంచి 31 వరకు యాదగిరిగుట్టలో ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్లీనమ్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశాలకు 33 జిల్లాల నుంచి సుమారు 500 మంది ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు.

ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్యక్షుడు కె. వెంకట్ మాట్లాడుతూ, వికలాంగుల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతోందని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్య అందించడంతో పాటు, స్వయం ఉపాధి రుణాల్లో 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలలో వికలాంగులకు అదనపు వాటా కేటాయించాలని కోరారు.

ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

వికలాంగుల పెన్షన్ రూ.6,000కు పెంచాలి: ఎన్‌పీఆర్‌డీ

Article Image

యాదాద్రి భువనగిరి వికలాంగుల పెన్షన్‌ను రూ.6,000కు పెంచి వెంటనే అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య డిమాండ్ చేశారు. వికలాంగుల చట్టాలు, సంక్షేమ పథకాల అమలుకు ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

జిల్లా అధ్యక్షుడు సూరపంగా ప్రకాష్ అధ్యక్షతన దుంపల మల్లారెడ్డి స్మారక భవనంలో జరిగిన జిల్లా విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా వికలాంగులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించారు. పెన్షన్లు పెంచడంలో ఆలస్యం ఎందుకని ప్రశ్నించారు. 2026-27 బడ్జెట్‌లో వికలాంగుల సంక్షేమానికి తగిన నిధులు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెన్షన్లు రద్దు చేసినట్లు ఆరోపిస్తూ, ప్రభుత్వ కార్యాలయాల్లో వికలాంగులకు అనుకూల సౌకర్యాలు లేవని పేర్కొన్నారు. విద్య, ఉపాధి అవకాశాల్లో వివక్ష కొనసాగుతోందని, వికలాంగులపై వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.

మే 29 నుంచి 31 వరకు యాదగిరిగుట్టలో ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్లీనమ్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశాలకు 33 జిల్లాల నుంచి సుమారు 500 మంది ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు.

ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్యక్షుడు కె. వెంకట్ మాట్లాడుతూ, వికలాంగుల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతోందని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్య అందించడంతో పాటు, స్వయం ఉపాధి రుణాల్లో 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలలో వికలాంగులకు అదనపు వాటా కేటాయించాలని కోరారు.

ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News