Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 16, 2026 03:11 AM

వేసవిలో నీటిని పొదుపుగా వాడాలి: రిటైర్డ్ ఈఈ బొడ్డు సురేందర్ రావు

వేసవిలో నీటిని పొదుపుగా వాడాలి: రిటైర్డ్ ఈఈ బొడ్డు సురేందర్ రావు

వేసవిలో నీటిని పొదుపుగా వాడాలి: రిటైర్డ్ ఈఈ బొడ్డు సురేందర్ రావు
March 14, 2026 06:20 PM 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

వేసవి కాలం దృష్ట్యా తాగు, సాగు నీటిని ప్రతి ఒక్కరూ పొదుపుగా వాడుకోవాలని నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఈ బొడ్డు సురేందర్ రావు సూచించారు. శనివారం మండల కేంద్రంలో స్థానిక విలేకరులతో మాట్లాడిన ఆయన, ఇటీవల వర్షాలు సమృద్ధిగా కురవడంతో భూగర్భ జలాలు పెరిగాయని, అయితే వాటిని జాగ్రత్తగా వినియోగించకపోతే మళ్లీ నీటి కొరత తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గుతున్నట్లు వార్తా కథనాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇంటి నల్లాల ద్వారా వచ్చే నీటిని వృథా చేయకుండా అవసరం ఉన్నప్పుడు మాత్రమే వినియోగించాలని, నీరు పట్టుకున్న తర్వాత నల్లలను తప్పనిసరిగా మూసివేయాలని సూచించారు.

రైతులు కూడా మోటార్లను నిరంతరం ఆన్ చేసి నీటిని వృథా చేయకుండా, పంటలకు అవసరమైనంత నీరు అందించిన తర్వాత వెంటనే మోటార్లను ఆఫ్ చేయాలని ఆయన సూచించారు. మంచినీరు కలుషితమైతే ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని, అందువల్ల నీటిని పరిశుభ్రంగా ఉంచి సురక్షితంగా వినియోగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని బొడ్డు సురేందర్ రావు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News