యాదాద్రి భువనగిరి,
వేసవికాలంలో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సమ్మర్ యాక్షన్ ప్లాన్–2026లో భాగంగా రూ. 88.15 లక్షల అంచనాలతో ప్రత్యేక ప్రణాళికకు ఆమోదం తెలిపారు.
ఈ యాక్షన్ ప్లాన్లో భాగంగా రైతుల నుండి అద్దె బోర్లు వినియోగించడం, తాత్కాలిక పైప్లైన్ల ఏర్పాటు, బోర్వెల్ల ఫ్లషింగ్ మరియు డీపెనింగ్ వంటి పనులను తక్షణమే చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.
ఈ కార్యక్రమాల అమలుకు మిషన్ భగీరథ శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ పి. కరుణాకరన్కు బాధ్యతలు అప్పగించారు. సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి