Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:17 AM

వేసవిలో నీటి ఎద్దడికి చెక్‌… ₹88 లక్షల యాక్షన్ ప్లాన్‌కు గ్రీన్ సిగ్నల్. కలెక్టర్

వేసవిలో నీటి ఎద్దడికి చెక్‌… ₹88 లక్షల యాక్షన్ ప్లాన్‌కు గ్రీన్ సిగ్నల్. కలెక్టర్

వేసవిలో నీటి ఎద్దడికి చెక్‌… ₹88 లక్షల యాక్షన్ ప్లాన్‌కు గ్రీన్ సిగ్నల్. కలెక్టర్
April 08, 2026 09:00 PM 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి,

వేసవికాలంలో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సమ్మర్ యాక్షన్ ప్లాన్–2026లో భాగంగా రూ. 88.15 లక్షల అంచనాలతో ప్రత్యేక ప్రణాళికకు ఆమోదం తెలిపారు.

ఈ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా రైతుల నుండి అద్దె బోర్లు వినియోగించడం, తాత్కాలిక పైప్‌లైన్ల ఏర్పాటు, బోర్‌వెల్‌ల ఫ్లషింగ్ మరియు డీపెనింగ్ వంటి పనులను తక్షణమే చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.

ఈ కార్యక్రమాల అమలుకు మిషన్ భగీరథ శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ పి. కరుణాకరన్‌కు బాధ్యతలు అప్పగించారు. సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News