శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో వేసవి కాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవిత అధికారులను ఆదేశించారు.
పెనుకొండ క్యాంపు కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, తాగునీటి సమస్యలు ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి, తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి సరఫరా సక్రమంగా కొనసాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో DE శ్రీనివాస్ సహా ఇతర అధికారులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి