Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గూగుల్ పే QR కోడ్ పేరుతో కొత్త మోసం.. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి: కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 05:57 PM

వేసవి శిక్షణ శిబిరమును ప్రారంభించిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

వేసవి శిక్షణ శిబిరమును ప్రారంభించిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

వేసవి శిక్షణ శిబిరమును ప్రారంభించిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
April 25, 2026 06:30 PM 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్బీనగర్,

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వనస్థలిపురం చత్రపతి శివాజీ మైదానంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాన్ని ఎల్బీనగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి సెలవుల్లో పిల్లలు, యువతకు క్రీడలు, శారీరక దారుఢ్యం, నైపుణ్యాల అభివృద్ధికి ఇలాంటి శిబిరాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. శారీరక, మానసిక, సామాజిక వికాసానికి ఇవి దోహదపడతాయని అన్నారు. పిల్లలలో ప్రతిభ పెంపొందించడంతో పాటు సమయాన్ని సద్వినియోగం చేసుకునే అలవాటు ఏర్పడుతుందని, క్రమశిక్షణ, జట్టు భావన పెరుగుతాయని వివరించారు.

తాను హుడా చైర్మన్‌గా ఉన్న సమయంలో ఈ ప్రదేశాన్ని పార్క్‌గా కాకుండా క్రీడా మైదానంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నామని గుర్తు చేశారు. ప్రస్తుతం గాయత్రి భవన్, డీపీఎస్ మైదానం, వనస్థలిపురం ఫేజ్-4, శివాజీ మైదానం వంటి పలు ప్రదేశాలను క్రీడా మైదానాలుగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. యువతకు ఆడుకునే వేదికలు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలోని నియోజకవర్గాల్లో స్విమ్మింగ్ పూల్స్ ఉన్నప్పటికీ ఎల్బీనగర్ నియోజకవర్గంలో మూడు ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. 8 నుంచి 80 ఏళ్ల వయస్సు వారందరికీ ఉపయోగపడేలా పార్కులు, క్రీడా మైదానాలు ఏర్పాటు చేశామని తెలిపారు.

అనంతరం పలు పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో హయత్‌నగర్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ రెడ్డి, అధికారులు అశోక్, నాగేందర్, వనస్థలిపురం మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్, బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ నాయకులు కటికరెడ్డి అరవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News