ఆదోని రూరల్, : విరుపాపురం గ్రామంలోని వీరబ్రహ్మయ్య స్వామి గుడి అభివృద్ధికి టిడిపి సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు చేయూతనందించారు. గ్రామ పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల విజ్ఞప్తికి స్పందించి రూ.90,000 విలువైన గ్రానైట్ బండలను అందజేశారు.
గ్రామంలో గుడి అభివృద్ధి పనుల కోసం సహాయం కోరగా వెంటనే స్పందించిన ఉమాపతి నాయుడు, అవసరమైన గ్రానైట్ను సమకూర్చి ఆదర్శంగా నిలిచారు. దీంతో గ్రామస్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా విరుపాపురం గ్రామంలోని వీరబ్రహ్మం గుడి వద్ద నిర్వహించిన ప్రతిష్టాపన కార్యక్రమానికి ఉమాపతి నాయుడు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. గుడి అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ఆయన తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి