PRINT TIME: July 11, 2026 04:58 PM
వీరబ్రహ్మం గుడి అభివృద్ధికి ఉమాపతి నాయుడు రూ.90,000 చేయూత
వీరబ్రహ్మం గుడి అభివృద్ధికి ఉమాపతి నాయుడు రూ.90,000 చేయూత
April 07, 2026 02:37 AM
118 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఆదోని రూరల్, : విరుపాపురం గ్రామంలోని వీరబ్రహ్మయ్య స్వామి గుడి అభివృద్ధికి టిడిపి సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు చేయూతనందించారు. గ్రామ పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల విజ్ఞప్తికి స్పందించి రూ.90,000 విలువైన గ్రానైట్ బండలను అందజేశారు.
గ్రామంలో గుడి అభివృద్ధి పనుల కోసం సహాయం కోరగా వెంటనే స్పందించిన ఉమాపతి నాయుడు, అవసరమైన గ్రానైట్ను సమకూర్చి ఆదర్శంగా నిలిచారు. దీంతో గ్రామస్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా విరుపాపురం గ్రామంలోని వీరబ్రహ్మం గుడి వద్ద నిర్వహించిన ప్రతిష్టాపన కార్యక్రమానికి ఉమాపతి నాయుడు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. గుడి అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ఆయన తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి