వెల్లంకిలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
వెల్లంకిలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Editor Desk
రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామ శాఖ అధ్యక్షుడు పున్న వెంకటేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావ దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో పార్టీ పోషించిన కీలక పాత్రను స్మరించుకున్నారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమం దిశగా పార్టీ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి పిట్ట మహేందర్ రెడ్డి, ఎడ్ల సుదర్శన్ రెడ్డి, పాశం సతీష్ రెడ్డి, ఠాకూర్ రమేష్ సింగ్, మిర్యాల జగన్, కొంగరి నిరంజన్, దేశబోయిన శ్రీధర్, చిందం ఉమాకాంతం, దొండ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి