Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
“64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” జీతాలు ఇవ్వకపోతే నీటి సరఫరా నిలిపివేత – కార్మికుల హెచ్చరిక రాఘవ్ చద్దా గది: భవిష్యత్ ప్రధాని యొక్క పుస్తకాల సామ్రాజ్యం అడవిలో ఆధ్యాత్మిక హోరు – శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తుల సందడి పెనుకొండలో శశి భూషణ్ పటేల్ జన్మదిన వేడుకలు – కేక్ కట్, మొక్క నాటిన టీడీపీ నేతలు సింగరేణి గనిలో దళిత కార్మికులపై అమానుషిక వివక్ష: వెయిటింగ్ రూమ్‌లో భోజనానికి అడ్డుకున్న అధికారులు! చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 04, 2026 10:41 PM

వీడ్కోలు వేడుకలో సందడి.. విద్యార్థుల కంటతడి

వీడ్కోలు వేడుకలో సందడి.. విద్యార్థుల కంటతడి

వీడ్కోలు వేడుకలో సందడి.. విద్యార్థుల కంటతడి
April 04, 2026 07:17 PM 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని శ్రీ సాయి కృప డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో డిగ్రీ 2023–2026 బ్యాచ్ విద్యార్థుల వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. కళాశాల సెమినార్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమాన్ని చైర్మన్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిగ్రీ పూర్తి చేసిన ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను కొనసాగించాలని సూచించారు. బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ కోర్సులు చేసి మంచి భవిష్యత్తు సాధించాలని కోరారు. త్వరలోనే కళాశాలలో క్యాంపస్ రిక్రూట్మెంట్ నిర్వహించి విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

విద్యార్థులు తమ మూడు సంవత్సరాల అనుభవాలను గుర్తు చేసుకుంటూ కళాశాలతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. భావోద్వేగాలతో మాట్లాడిన విద్యార్థులు కంటతడి పెట్టించారు. అనంతరం ఆటపాటలతో కార్యక్రమం సందడిగా కొనసాగింది.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ యాకుబ్ బాబా, అధ్యాపకులు శ్రావణ్ రెడ్డి, మహేందర్, మోయిన్, వీరయ్య, మరిపల్లి రాజు, సుమలత, శ్యామ్ కుమార్, రాము తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News