వీడ్కోలు వేడుకలో సందడి.. విద్యార్థుల కంటతడి
వీడ్కోలు వేడుకలో సందడి.. విద్యార్థుల కంటతడి
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని శ్రీ సాయి కృప డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో డిగ్రీ 2023–2026 బ్యాచ్ విద్యార్థుల వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. కళాశాల సెమినార్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని చైర్మన్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిగ్రీ పూర్తి చేసిన ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను కొనసాగించాలని సూచించారు. బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ కోర్సులు చేసి మంచి భవిష్యత్తు సాధించాలని కోరారు. త్వరలోనే కళాశాలలో క్యాంపస్ రిక్రూట్మెంట్ నిర్వహించి విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
విద్యార్థులు తమ మూడు సంవత్సరాల అనుభవాలను గుర్తు చేసుకుంటూ కళాశాలతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. భావోద్వేగాలతో మాట్లాడిన విద్యార్థులు కంటతడి పెట్టించారు. అనంతరం ఆటపాటలతో కార్యక్రమం సందడిగా కొనసాగింది.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ యాకుబ్ బాబా, అధ్యాపకులు శ్రావణ్ రెడ్డి, మహేందర్, మోయిన్, వీరయ్య, మరిపల్లి రాజు, సుమలత, శ్యామ్ కుమార్, రాము తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి