PRINT TIME: March 10, 2026 01:10 AM
వయోవృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించిన జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి వి.మాధవి
వయోవృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించిన జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి వి.మాధవి
March 09, 2026 06:56 PM
11 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
యాదాద్రి భువనగిరి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో రాయగిరిలోని సహృదయ వయోవృద్ధుల ఆశ్రమాన్ని సంస్థ కార్యదర్శి వి. మాధవి లత సోమవారం సందర్శించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు సూచనల మేరకు ఈ పర్యటన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆశ్రమంలో నివసిస్తున్న వయోవృద్ధులతో ముఖాముఖి మాట్లాడి వారికి అందుతున్న వసతులపై వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ తదితర సంక్షేమ పథకాల లబ్ధి వృద్ధులకు పూర్తిగా చేరేలా ఆశ్రమ నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆశ్రమంలో కొంత వసతుల కొరత ఉన్నట్టు గుర్తించిన ఆమె, వాటిపై యాజమాన్యం తక్షణ చర్యలు తీసుకుని వృద్ధులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో ఆశ్రమ మేనేజర్ రఫీతో పాటు వయోవృద్ధులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి