Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం 10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 05:00 PM

వయోవృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించిన జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి వి.మాధవి

వయోవృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించిన జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి వి.మాధవి

వయోవృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించిన జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి వి.మాధవి
March 09, 2026 06:56 PM 181 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో రాయగిరిలోని సహృదయ వయోవృద్ధుల ఆశ్రమాన్ని సంస్థ కార్యదర్శి వి. మాధవి లత సోమవారం సందర్శించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు సూచనల మేరకు ఈ పర్యటన నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆశ్రమంలో నివసిస్తున్న వయోవృద్ధులతో ముఖాముఖి మాట్లాడి వారికి అందుతున్న వసతులపై వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ తదితర సంక్షేమ పథకాల లబ్ధి వృద్ధులకు పూర్తిగా చేరేలా ఆశ్రమ నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఆశ్రమంలో కొంత వసతుల కొరత ఉన్నట్టు గుర్తించిన ఆమె, వాటిపై యాజమాన్యం తక్షణ చర్యలు తీసుకుని వృద్ధులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో ఆశ్రమ మేనేజర్ రఫీతో పాటు వయోవృద్ధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News