Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 11:11 PM

వయోవృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించిన జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి వి.మాధవి

వయోవృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించిన జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి వి.మాధవి

వయోవృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించిన జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి వి.మాధవి
09-03-2026 185 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో రాయగిరిలోని సహృదయ వయోవృద్ధుల ఆశ్రమాన్ని సంస్థ కార్యదర్శి వి. మాధవి లత సోమవారం సందర్శించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు సూచనల మేరకు ఈ పర్యటన నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆశ్రమంలో నివసిస్తున్న వయోవృద్ధులతో ముఖాముఖి మాట్లాడి వారికి అందుతున్న వసతులపై వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ తదితర సంక్షేమ పథకాల లబ్ధి వృద్ధులకు పూర్తిగా చేరేలా ఆశ్రమ నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఆశ్రమంలో కొంత వసతుల కొరత ఉన్నట్టు గుర్తించిన ఆమె, వాటిపై యాజమాన్యం తక్షణ చర్యలు తీసుకుని వృద్ధులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో ఆశ్రమ మేనేజర్ రఫీతో పాటు వయోవృద్ధులు పాల్గొన్నారు.

Sthanikam

వయోవృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించిన జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి వి.మాధవి

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో రాయగిరిలోని సహృదయ వయోవృద్ధుల ఆశ్రమాన్ని సంస్థ కార్యదర్శి వి. మాధవి లత సోమవారం సందర్శించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు సూచనల మేరకు ఈ పర్యటన నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆశ్రమంలో నివసిస్తున్న వయోవృద్ధులతో ముఖాముఖి మాట్లాడి వారికి అందుతున్న వసతులపై వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ తదితర సంక్షేమ పథకాల లబ్ధి వృద్ధులకు పూర్తిగా చేరేలా ఆశ్రమ నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఆశ్రమంలో కొంత వసతుల కొరత ఉన్నట్టు గుర్తించిన ఆమె, వాటిపై యాజమాన్యం తక్షణ చర్యలు తీసుకుని వృద్ధులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో ఆశ్రమ మేనేజర్ రఫీతో పాటు వయోవృద్ధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News