వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి
Editor Desk
రామన్నపేటలో మే 18, 19 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా 3వ మహాసభలను విజయవంతం చేయాలని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ పిలుపునిచ్చారు.
గురువారం మండల కేంద్రంలోని కూలీ వాడలో మహాసభల ప్రచార కరపత్రాన్ని సంఘం నాయకులు, వ్యవసాయ కార్మికులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నర్సింహ్మ మాట్లాడుతూ, భూమిలేని పేదలకు భూములు పంచడం, కూలీ పెంపు, కులవివక్ష నిర్మూలన లక్ష్యంగా మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య 1936లో వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించారని తెలిపారు. అప్పటి నుంచి గ్రామీణ పేదల సంక్షేమం కోసం నిరంతరం పోరాటాలు కొనసాగిస్తున్నదని చెప్పారు.
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచాలని గ్రామాల్లో పెద్దఎత్తున సమ్మెలు నిర్వహించి సంఘం కీలక పాత్ర పోషించిందన్నారు. 2005లో ఉపాధి హామీ చట్టం అమలుకు కూడా వామపక్ష పార్టీలతో కలిసి పోరాటాలు చేసినట్లు వివరించారు.
రాష్ట్ర కమిటీ సభ్యులు జెల్లెల పెంటయ్య మాట్లాడుతూ, మహాసభల సందర్భంగా గ్రామాల వారీగా ప్రచార జాతాలు నిర్వహించి, మే 18న భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 300 మంది ప్రతినిధులతో మహాసభలు జరగనున్నాయని చెప్పారు.
ఈ బహిరంగ సభకు ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు, ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యండి జహంగీర్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మేడి ముకుందం, కార్యదర్శి కందుల హనుమంతు, సీఐటీయూ మండల కార్యదర్శి గొరిగె సోములు, నాయకులు గాదె నరేందర్, మేడి అంజమ్మ, మమత, చంద్రమ్మ, రాములమ్మ, గాదె పద్మ, గోర్ల అండాలు, జాన్సీ, బందెల ముత్యాలి, గట్టు అనిత తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి