వాటర్ ప్లాంట్ పునరుద్ధరణకు డిమాండ్ మంచినీటి కోసం ప్రజల ఇబ్బందులు.. సీపీఐ(ఎం) ఆందోళన
వాటర్ ప్లాంట్ పునరుద్ధరణకు డిమాండ్ మంచినీటి కోసం ప్రజల ఇబ్బందులు.. సీపీఐ(ఎం) ఆందోళన
Editor Desk
భువనగిరి: పట్టణంలోని 9వ వార్డు సింగనగూడంలో ఉన్న వాటర్ ప్లాంట్ను తక్షణమే పునరుద్ధరించాలని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ డిమాండ్ చేశారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడారు.
సుమారు 10 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ వాటర్ ప్లాంట్ గత రెండు మూడు సంవత్సరాలుగా రిపేర్లు చేయకపోవడం, కరెంట్ బిల్లులు చెల్లించకపోవడం వల్ల మూతపడిందని తెలిపారు. దీంతో స్థానిక ప్రజలు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ప్రజలు బైపాస్ రోడ్డు దాటి నీరు తెచ్చుకునే పరిస్థితి ఉందని, ఇది ప్రమాదకరమని పేర్కొన్నారు. వెంటనే వాటర్ ప్లాంట్ను పునఃప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ సెక్రటేరియట్ సభ్యులు గంధ మల్ల మాతయ్య, చింతల శివ, మన్నె రమేష్, మన్నె రాజు, చింతల ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి