PRINT TIME: April 16, 2026 11:29 PM
వలిగొండ ఎక్స్ రోడ్డు వద్ద ఘోర ప్రమాదం: మహిళ మృతి
వలిగొండ ఎక్స్ రోడ్డు వద్ద ఘోర ప్రమాదం: మహిళ మృతి
April 16, 2026 09:39 PM
237 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
మరో వ్యక్తికి తీవ్ర గాయాలు.. చౌటుప్పల్ వాసిగా గుర్తింపు
మండల పరిధిలోని వలిగొండ ఎక్స్ రోడ్డు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే దుర్మరణం చెందింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదమ్మ (50, యాదవ్ ) అనే మహిళ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది.ఈ ప్రమాదంలో చౌటుప్పల్ పట్టణంలోని విద్యానగర్కు చెందిన ఈడం మల్లేష్ (56, పద్మశాలి) తీవ్రంగా గాయపడ్డారు. వృత్తిరీత్యా వంట మాస్టర్ అయిన మల్లేష్ను చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న చౌటుప్పల్ ఎస్.ఐ డి. నర్సిరెడ్డి తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి