అందోల్, స్థానికం ప్రతినిధి:
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ దంపతులు సంగారెడ్డి పట్టణం లో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం వైకుంఠ పురం శ్రీ వెంకటేశ్వర దేవాలయం లో వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు . స్వామి వారి పల్లకి సేవలో భక్తులతో కలసి పాల్గోన్నారు . దేవాలయం అభివృద్ధికి, రాజగోపురం నిర్మాణానికి కృషి చేస్తామన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి