Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం 10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:50 PM

వడ్ల కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి

వడ్ల కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి

వడ్ల కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి
April 11, 2026 12:59 PM 80 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: వరి కోతలు ప్రారంభమై 15 రోజులు గడిచినా ఇప్పటివరకు వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంపై సిపిఐ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతుల నుంచి వడ్ల కొనుగోలు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు.

కొనుగోలు కేంద్రాలు కేవలం 45 రోజులపాటు మాత్రమే కొనసాగుతాయని, వర్షాకాలం ప్రారంభానికి ముందే మార్కెట్‌కు వచ్చిన వడ్లన్నీ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

మార్కెట్లకు సరిపడా భర్దాన్ సంచులు పంపించడంతో పాటు, తరుగుడు పేరుతో రైస్ మిల్లర్లు రైతులకు ఇబ్బందులు కలిగించవద్దని హెచ్చరించారు. గ్రేడ్-1, గ్రేడ్-2 వడ్లను సక్రమంగా పరిశీలించి కొనుగోలు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరు నరసింహ, ఎర్ర రమేష్ గౌడ్, రచ్చ యాదగిరి, గంగాపురం యాదయ్య, ఊట్కూరు భగవంత, వీరమల్ల వెంకటయ్య, ఊట్కూరు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News