వడ్ల కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి
వడ్ల కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి
Editor Desk
రామన్నపేట: వరి కోతలు ప్రారంభమై 15 రోజులు గడిచినా ఇప్పటివరకు వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంపై సిపిఐ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతుల నుంచి వడ్ల కొనుగోలు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు.
కొనుగోలు కేంద్రాలు కేవలం 45 రోజులపాటు మాత్రమే కొనసాగుతాయని, వర్షాకాలం ప్రారంభానికి ముందే మార్కెట్కు వచ్చిన వడ్లన్నీ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.
మార్కెట్లకు సరిపడా భర్దాన్ సంచులు పంపించడంతో పాటు, తరుగుడు పేరుతో రైస్ మిల్లర్లు రైతులకు ఇబ్బందులు కలిగించవద్దని హెచ్చరించారు. గ్రేడ్-1, గ్రేడ్-2 వడ్లను సక్రమంగా పరిశీలించి కొనుగోలు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరు నరసింహ, ఎర్ర రమేష్ గౌడ్, రచ్చ యాదగిరి, గంగాపురం యాదయ్య, ఊట్కూరు భగవంత, వీరమల్ల వెంకటయ్య, ఊట్కూరు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి