వడ్ల కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి. రైతులపై రాజకీయాలు తగవు : కునూరి సాయికుమార్ గౌడ్
వడ్ల కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి. రైతులపై రాజకీయాలు తగవు : కునూరి సాయికుమార్ గౌడ్
Editor Desk
రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం సహా అన్ని గ్రామాల్లో వడ్ల కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని బోగారం సర్పంచ్, కునూరి సాయికుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
మండల వ్యాప్తంగా రైతులు సుమారు 13 లక్షలకుపైగా వడ్ల బస్తాలు పండిస్తే ఇప్పటి వరకు 20 శాతం కూడా కొనుగోలు జరగలేదన్నారు. రైతులు అప్పులు చేసి పంట పండిస్తే ధాన్యం కొనుగోలు కోసం రోజుల తరబడి అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.తరలించిన ధాన్యం రోజులు గడిచినా దిగుమతి కాక రైతులు, లారీ డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఇంద్రపాలనగరంలో 70 మంది రైతులు ప్రభుత్వం సూచించిన స్థలంలోనే వడ్లు పోశారని, కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్రారంభించి రైతులను రాజకీయాలకు అతీతంగా చూడాలని కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే రైతులతో కలిసి ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి