Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:00 AM

వడ్ల కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి. రైతులపై రాజకీయాలు తగవు : కునూరి సాయికుమార్ గౌడ్

వడ్ల కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి. రైతులపై రాజకీయాలు తగవు : కునూరి సాయికుమార్ గౌడ్

వడ్ల కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి.  రైతులపై రాజకీయాలు తగవు : కునూరి సాయికుమార్ గౌడ్
17-05-2026 136 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం సహా అన్ని గ్రామాల్లో వడ్ల కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని బోగారం సర్పంచ్, కునూరి సాయికుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

మండల వ్యాప్తంగా రైతులు సుమారు 13 లక్షలకుపైగా వడ్ల బస్తాలు పండిస్తే ఇప్పటి వరకు 20 శాతం కూడా కొనుగోలు జరగలేదన్నారు. రైతులు అప్పులు చేసి పంట పండిస్తే ధాన్యం కొనుగోలు కోసం రోజుల తరబడి అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.తరలించిన ధాన్యం రోజులు గడిచినా దిగుమతి కాక రైతులు, లారీ డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఇంద్రపాలనగరంలో 70 మంది రైతులు ప్రభుత్వం సూచించిన స్థలంలోనే వడ్లు పోశారని, కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్రారంభించి రైతులను రాజకీయాలకు అతీతంగా చూడాలని కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే రైతులతో కలిసి ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు.

Sthanikam

వడ్ల కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి. రైతులపై రాజకీయాలు తగవు : కునూరి సాయికుమార్ గౌడ్

Article Image

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం సహా అన్ని గ్రామాల్లో వడ్ల కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని బోగారం సర్పంచ్, కునూరి సాయికుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

మండల వ్యాప్తంగా రైతులు సుమారు 13 లక్షలకుపైగా వడ్ల బస్తాలు పండిస్తే ఇప్పటి వరకు 20 శాతం కూడా కొనుగోలు జరగలేదన్నారు. రైతులు అప్పులు చేసి పంట పండిస్తే ధాన్యం కొనుగోలు కోసం రోజుల తరబడి అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.తరలించిన ధాన్యం రోజులు గడిచినా దిగుమతి కాక రైతులు, లారీ డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఇంద్రపాలనగరంలో 70 మంది రైతులు ప్రభుత్వం సూచించిన స్థలంలోనే వడ్లు పోశారని, కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్రారంభించి రైతులను రాజకీయాలకు అతీతంగా చూడాలని కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే రైతులతో కలిసి ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News