Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలి జూలైలోనే పీఎం కిసాన్ 23వ విడత?.. రైతులకు ఎదురుచూపులు! 131వ సవరణ: ప్రజాస్వామ్య బలోపేతమా? లేక కొత్త సవాళ్ల ఆరంభమా? ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 21, 2026 08:14 PM

వడ్డెరుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది..

వడ్డెరుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది..

వడ్డెరుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది..
April 21, 2026 06:39 PM 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

నామినేటెడ్ పదవుల్లో సముచిత ప్రాధాన్యత ఇస్తాం..

పెండింగ్ బిల్లులు ఇప్పటికే విడుదల చేశాం..

రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి..


నల్లగొండ : నిరంతరం కష్టపడి పని చేసే వడ్డెర సోదరుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెన్నార్ గార్డెన్స్‌లో నిర్వహించిన అఖిలభారత వడ్డెర సంక్షేమ సంఘం సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ జగద్గురు ఇమ్మడి సిద్ధ రామేశ్వర స్వామి సమక్షంలో జరిగిన ఈ సభలో మంత్రి వడ్డెర సామాజిక వర్గానికి పలు కీలక హామీలు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డెరులకు సంబంధించిన పెండింగ్ బిల్లులన్నింటినీ విడుదల చేశామని గుర్తు చేశారు. వచ్చే నెలలో భర్తీ చేయనున్న నామినేటెడ్ పదవుల్లో వడ్డెరులకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. వడ్డెరుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే బాధ్యతను తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు. నల్లగొండ పట్టణంలో నిర్మాణ దశలో ఉన్న వడ్డెర సంఘం భవనాన్ని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని మంత్రి ప్రకటించారు.

సంఘం అధ్యక్షులు అలకుంట్ల నాగరత్నం రాజు అధ్యక్షతన జరిగిన ఈ సభలో వడ్డెర సామాజిక వర్గ ప్రతినిధులు భారీగా పాల్గొన్నారు. ఎమ్మెన్నార్ గార్డెన్స్ జనసందోహంతో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, ఎంబీసీ చైర్మన్ జరిపేటి జైపాల్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ గోగుల సరిత, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు మంజుల రమేష్, జాతీయ ప్రధాన కార్యదర్శి గుంజ శ్రీనివాస్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంటిపుల్లి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు గుంజ వెంకట్ నారాయణ, జిల్లా అధ్యక్షులు వేముల సుధాకర్, కార్పొరేటర్లు ఆలకుంట్ల ఝాన్సీరాణి, ఆలకుంట్ల నాగరాజుతో పాటు యాదాద్రి జిల్లా అధ్యక్షులు గుర్రం కుమారస్వామి, పల్లపు దుర్గయ్య, పల్లపు నారాయణ, రవి తదితరులు పాల్గొని వడ్డెర సామాజిక వర్గ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రసంగించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News