నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు సాయి బృందావన కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. వడ దెబ్బ కారణంగా అమరోజు పాండయ్య అనే వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటనతో కాలనీలో విషాద వాతావరణం నెలకొంది.
మరణించిన పాండయ్య మృతదేహానికి 6వ వార్డు కౌన్సిలర్ జేరిపోతుల సత్యనారాయణ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.అలాగే, మృతుని కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.5,000 నగదు అందజేశారు. స్థానికులు కౌన్సిలర్ చర్యలను అభినందిస్తూ, ఇలాంటి సందర్భాల్లో ప్రజాప్రతినిధులు ముందుకు రావడం ఆదర్శమని పేర్కొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి