Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:10 AM

ఉపాధి కూలీల బకాయిలు వెంటనే చెల్లించాలి. జల్లెల పెంటయ్య.

ఉపాధి కూలీల బకాయిలు వెంటనే చెల్లించాలి. జల్లెల పెంటయ్య.

ఉపాధి కూలీల బకాయిలు వెంటనే చెల్లించాలి. జల్లెల పెంటయ్య.
April 09, 2026 05:24 PM 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉపాధి హామీ కూలీలకు పెండింగ్‌లో ఉన్న కూలీ డబ్బులను తక్షణమే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జల్లెల పెంటయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సిరిపురం గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశాన్ని సందర్శించి కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే దిశగా చర్యలు తీసుకుంటోందని విమర్శించారు. రాష్ట్రంపై నిధుల భారం మోపుతూ తగిన కేటాయింపులు చేయడం లేదని ఆరోపించారు. సిరిపురం గ్రామంలో కూలీలు గత మూడు నెలలుగా పనిచేసిన కూలీ డబ్బులు అందలేదని, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో పనిచేయాల్సి వస్తోందని తెలిపారు.

ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఒంటిపూట పని విధానం అమలు చేయాలని, పని ప్రదేశాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలపై స్థానిక ఏపీవోకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

అనంతరం గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా కూనూరు సుష్మ, కార్యదర్శిగా గాదె లావణ్యను ఎంపిక చేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, సంఘం జిల్లా నాయకులు బలుగూరి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News