Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్వతాపురం రోడ్డుకు భూమిపూజ.. రూ.30 లక్షలతో బీటీ రోడ్డు ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు నరాలు తెగే ఉత్కంఠ... ఢిల్లీ చేతిలో గెలుపు.. గుజరాత్ తన్నుకుపోయింది! “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 09, 2026 07:10 PM

ఉపాధి కూలీల బకాయిలు వెంటనే చెల్లించాలి. జల్లెల పెంటయ్య.

ఉపాధి కూలీల బకాయిలు వెంటనే చెల్లించాలి. జల్లెల పెంటయ్య.

ఉపాధి కూలీల బకాయిలు వెంటనే చెల్లించాలి. జల్లెల పెంటయ్య.
April 09, 2026 05:24 PM 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉపాధి హామీ కూలీలకు పెండింగ్‌లో ఉన్న కూలీ డబ్బులను తక్షణమే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జల్లెల పెంటయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సిరిపురం గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశాన్ని సందర్శించి కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే దిశగా చర్యలు తీసుకుంటోందని విమర్శించారు. రాష్ట్రంపై నిధుల భారం మోపుతూ తగిన కేటాయింపులు చేయడం లేదని ఆరోపించారు. సిరిపురం గ్రామంలో కూలీలు గత మూడు నెలలుగా పనిచేసిన కూలీ డబ్బులు అందలేదని, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో పనిచేయాల్సి వస్తోందని తెలిపారు.

ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఒంటిపూట పని విధానం అమలు చేయాలని, పని ప్రదేశాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలపై స్థానిక ఏపీవోకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

అనంతరం గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా కూనూరు సుష్మ, కార్యదర్శిగా గాదె లావణ్యను ఎంపిక చేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, సంఘం జిల్లా నాయకులు బలుగూరి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News