ఉపాధి కూలీల బకాయిలు వెంటనే చెల్లించాలి. జల్లెల పెంటయ్య.
ఉపాధి కూలీల బకాయిలు వెంటనే చెల్లించాలి. జల్లెల పెంటయ్య.
Editor Desk
ఉపాధి హామీ కూలీలకు పెండింగ్లో ఉన్న కూలీ డబ్బులను తక్షణమే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జల్లెల పెంటయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సిరిపురం గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశాన్ని సందర్శించి కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే దిశగా చర్యలు తీసుకుంటోందని విమర్శించారు. రాష్ట్రంపై నిధుల భారం మోపుతూ తగిన కేటాయింపులు చేయడం లేదని ఆరోపించారు. సిరిపురం గ్రామంలో కూలీలు గత మూడు నెలలుగా పనిచేసిన కూలీ డబ్బులు అందలేదని, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో పనిచేయాల్సి వస్తోందని తెలిపారు.
ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఒంటిపూట పని విధానం అమలు చేయాలని, పని ప్రదేశాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలపై స్థానిక ఏపీవోకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
అనంతరం గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా కూనూరు సుష్మ, కార్యదర్శిగా గాదె లావణ్యను ఎంపిక చేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, సంఘం జిల్లా నాయకులు బలుగూరి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి