Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ లో ట్రాఫిక్ సమస్యల నివారణ కు ఆపరేషన్ రోప్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 09:59 AM

ఉపాధి కూలీ రూ.800 చేయాలి.. ఈ-కేవైసీ రద్దు చేయాలి. నరసింహ

ఉపాధి కూలీ రూ.800 చేయాలి.. ఈ-కేవైసీ రద్దు చేయాలి. నరసింహ

ఉపాధి కూలీ రూ.800 చేయాలి.. ఈ-కేవైసీ రద్దు చేయాలి. నరసింహ
April 22, 2026 02:02 PM 131 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ: పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉపాధి హామీ కార్మికులకు రోజుకు రూ.800 కూలీ చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ ప్రభుత్వం‌ను డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పనులకు అడ్డంకిగా మారుతున్న ఈ-కేవైసీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు.

మోటకొండూర్ మండలంలోని ఆరెగూడెం గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కూలీలకు రోజువారీ కూలీ ఎంతనో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. వారానికి ఒకసారి పే స్లిప్పులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రూ.150 నుంచి రూ.200 మాత్రమే ఇస్తున్నారని కార్మికులు చెబుతున్నారని, ప్రభుత్వం నిర్ణయించిన కనీస కూలీ అయినా పూర్తిగా చెల్లించాలని ప్రశ్నించారు.

ఈ-కేవైసీ కారణంగా అనేక మంది కార్మికులు పనులకు దూరమవుతున్నారని, దాన్ని వెంటనే రద్దు చేయాలని ఆయన కోరారు. పని ప్రదేశాల్లో మౌలిక వసతులు కల్పించడం, ప్రమాద బీమా సదుపాయం అమలు చేయాలని సూచించారు.

కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొలగాని జయరాములు మాట్లాడుతూ, సాగునీరు లేక ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో కనీసం 200 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. భూమిలేని పేదలకు రూ.12 వేల ఆర్థిక సహాయం హామీని అమలు చేయాలని కోరారు.

కార్యక్రమంలో సంఘం మండల నాయకులు కొల్లూరు ఆంజనేయులు, టెక్నికల్ అసిస్టెంట్ ఏ. మంగ, మేటు హరిబాబు, కొల్లూరి శ్రీహరి, సుధాకర్, రమేష్, నాగరాజ్, గాదుల శ్రీను, సత్యలక్ష్మి, జ్యోతి, అశ్విని, గణేష్, పద్మ, రజిని, సరిత, దివ్య, మల్లేష్, జహంగీర్, మల్లయ్య, నరసింహులు, బాల నరసింహ, మానస, లక్ష్మి, అఖిల, భాగ్యలక్ష్మి, బాలమణి, లింగమ్మ, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News